Crime News: భార్యని చంపి పెట్రోల్ పోసి తగలపట్టిన భర్త.. కుటుంబ కలహాలే కారణమా..?

Crime News: ఈ రోజుల్లో కుటుంబ కలహాలు వల్ల భార్య భర్తల మధ్య గొడవలు అధికమయ్యాయి. కానీ కొన్ని సందర్భాలలో ఈ కలహాల వల్ల చాలా మంది ప్రాణాలు కూడా కోల్పోతున్నారు . ఇలాంటి సంఘటన విజయనగరం జిల్లాలో చోటు చేసుకుంది. కట్టుకున్న భార్యను కిరాతకంగా చంపి మరి పెట్రోల్ పోసి తగాలపట్టిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ ఘటనకు సంబంధించిన వివరాలిలావున్నాయి.

విజయనగరం జిల్లా కొత్తవలస మండలం అప్పన్న దొరపాలెం పంచాయితీ జోడిమెరక గ్రామానికి చెందిన జోడి నాగరాజు, భార్య జోడి లక్ష్మీతో కలిసి గ్రామంలో నివాసం ఉంటున్నాడు. ఐతే వారిద్దరి మద్య మనస్పర్థల వల్ల తరచు గొడవ పడేవారు. ఈ నేపథ్యంలో నాగరాజు తన భార్య లక్ష్మి నీ హత్య చేశాడు. వారం రోజులైనా లక్ష్మీ ఎక్కడ కనిపించకపోవడంతో బంధుమిత్రులకు అనుమానం వచ్చింది. అయితే బంధువులు లక్ష్మి కనిపించటం లేదని పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇచ్చారు. కంప్లైంట్ ఇచ్చిన రోజు నుండి నాగరాజు కూడా కనిపించకపోవడంతో అందరికీ అనుమానాలు వచ్చాయి.

కొత్తవలస పోలీసులు లక్ష్మి కోసం గాలించగా 2 రోజుల క్రితం కొత్త వలస మోడల్ స్కూల్ వెనక భాగంలో ఒక మృతదేహాన్ని గుర్తించారు. మృతదేహాన్ని పరిశీలించిన పోలీసులు అది లక్ష్మి మృతదేహం గా నిర్ధారించారు. పరారీలో ఉన్న లక్ష్మీ భర్త నీ పోలీసులు అదుపులోకి తీసుకొని విచారించగా నిజం బయట పెట్టాడు. నాగరాజు మొదట తన భార్యను హత్య చేసి తర్వాత పెట్రోల్ పోసి తగలబెట్టడని విచారణలో తేలింది. నాగరాజు లక్ష్మి దంపతులకు 5 ఏళ్ల కుమారుడు కూడా ఉన్నాడు. కుటుంబ కలహాల వల్ల ఈ హత్య జరిగి ఉండవచ్చునని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.