Crime News: రాత్రి ఇంట్లో నిద్రించిన బాలిక…తెల్లారేసరికి చెట్ల పొదల మద్య శవమై…!

Crime News: దేశంలో రోజు రోజుకి మహిళల మీద అత్యాచారాలు పెరిగిపోతున్నాయి. మహిళలను, బాలికలను సంరక్షించడానికి ప్రభుత్వాలు ఎన్ని కఠిన చర్యలు చేపట్టినప్పటికీ.. మహిళల మీద అత్యాచారాలు పాల్పడుతున్న వారి ఆగడాలను అరికట్టలేకపోతున్నారు. ప్రతిరోజు ఎక్కడో ఒక చోట ఇలాంటి ఘటనలు జరుగుతూనే ఉన్నాయి. ఇటీవల మైనర్ బాలిక మీద జరిగిన అత్యాచార ఘటన తీవ్ర కలకలం రేపుతోంది.

వివరాల్లోకి వెళితే… వికారాబాద్ జిల్లాలో దారుణ ఘటన చోటుచేసుకుంది. మైనర్ బాలిక మీద కొందరు గుర్తు తెలియని వ్యక్తులు అత్యాచారం చేసి బాలికను హత్య చేశారు. పూడూరు మండలానికి చెందిన మైనర్ బాలిక (15) పదో తరగతి చదువుతోంది. ఎప్పటిమాదిరిగా ఆదివారం రాత్రి ఇంట్లో నిద్రించిన బాలిక సోమవారం ఉదయం ఇంట్లో కనిపించకపోయేసరికి తల్లిదండ్రులు కంగారుపడి చుట్టుపక్కల వెతికారు.ఇంటికి కొద్దిదూరంలోని నిర్మానుష్య ప్రదేశంలో పొదలమధ్య శవమై కనిపించింది. ఈ ఘటన గురించి సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు . బాలికను హత్య చేసినట్లుగా బాలిక ఒంటిపై గాయాలు ఉండటంతో హత్య జరిగినట్లు పోలీసులు గుర్తించారు.

బాలిక మీద అత్యాచారం చేసి తర్వాత హత్య చేసి ఉంటారని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఈ కేసులో అనుమానితులుగా ఉన్న మహేందర్‌తోపాటు మరో ముగ్గురు యువకులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. పోలీసుల విచారణలో మహేందర్ ఆదివారం రాత్రి మిత్రులను ఆహ్వానించి విందు చేసుకున్నట్లు తెలిసింది. మహేందర్ కు బాలికతో ఉన్న పరిచయం వల్ల ఆమెను తెల్లవారుజామున బయటికి రప్పించి ఆమె మీద అత్యాచారానికి పాల్పడినట్లు పోలీసులు నిర్ధారణకు వచ్చారు.అదనపు ఎస్పీ రషీద్‌ ఆధ్వర్యంలో విచారణ చేపట్టి డాగ్‌స్క్వాడ్‌, క్లూస్‌ టీమ్ లను రంగంలోకి దింపి ఆధారాలు సేకరించారు.