Crime News: ప్రేమ జంట కిడ్నాప్ కి పథకం వేసిన యువతి తండ్రి… చివరికి ఏమైందంటే?

Crime News: ఈ మధ్యకాలంలో యువతీ యువకులు ప్రేమకు ఆకర్షణకు మధ్య ఉన్న తేడా తెలియకుండా ప్రేమ పేరుతో కన్న తల్లిదండ్రులను మోసం చేస్తున్నారు.ప్రేమించిన వారి కోసం తల్లిదండ్రులను ఎదిరించి ఇంటి నుండి పారిపోయి వివాహాలు చేసుకుంటున్నారు. పిల్లలు ఇలా చేయటం వల్ల తల్లిదండ్రులు వారిని హత్య చేయటానికి కూడా వెనకాడటం లేదు. తాజాగా ఇటువంటి సంఘటన కోయంబత్తూర్ లో చోటుచేసుకుంది.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కోయంబత్తూరులోని లక్ష్మీ మిల్ సిగ్నల్ వద్ద ఒక ప్రేమ జంటను కిడ్నాప్ చేయటానికి ప్రయత్నించిన వారిని అడ్డుకొని ట్రాఫిక్ పోలీసులు, స్థానికులు ఆ యువ జంటను కాపాడారు.ఇంటి నుండి పారిపోయి ప్రేమించిన వ్యక్తిని పెళ్లి చేసుకుందన్న కోపంతో యువతి తండ్రి వారిని కిడ్నాప్ చేయడానికి ప్రయత్నం చేశాడు. కోయంబత్తూర్ లోని లక్ష్మీ మిల్ సిగ్నల్ వద్ద ప్రేమ జంటను కిడ్నాప్ చేయటానికి కొందరు వ్యక్తులు ప్రయత్నించగా యువకుడు కారులో ఎక్కటానికి నిరాకరించి అక్కడ ఉన్న స్థానికులను, ట్రాఫిక్ పోలీస్ సిబ్బందిని తమని కాపాడండి అంటూ వేడుకున్నారు. ఈ ఘటన వల్ల సిగ్నల్ వద్ద భారీగా ట్రాఫిక్ జాం అవడంతో పోలీసులు ప్రేమ జంటను విచారించగా మొత్తం విషయం వెల్లడించారు.

చేసుకున్నందుకు తమ తల్లిదండ్రులే తమనీ చంపటానికి కిడ్నాప్ చేస్తున్నారని తనని ఎలాగైనా కాపాడండి అంటూ అందరి కాళ్ళమీద పడి ప్రాధేయపడ్డారు. పోలీసులు ఈ విషయంలో కేసు నమోదు చేసుకొని కిడ్నాప్ చేయడానికి ఉపయోగించిన కారుని స్వాధీనం చేసుకున్నారు.బాలిక తల్లిదండ్రులను విచారిస్తున్నారు. తమని ఎదిరించి కూతురు ప్రేమ వివాహం చేసుకున్నందుకు తల్లిదండ్రులు ఆమెపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారని పోలీసులు వెల్లడించారు.