Crime News: భార్య అలిగి పుట్టింటికి వెళ్ళిందనీ కొడుకుని నరికి చంపిన తండ్రి…!

Crime News: ఈ రోజుల్లో మనుషులు బంధాలు బంధుత్వాలకు విలువ ఇవ్వటం లేదు. చిన్న చిన్న విషయాలకే రక్త సంబంధం కూడా మరచిపోయి దారుణాలకు పాల్పడుతున్నారు.ఇటీవల ఎన్టీఆర్ జిల్లాలో ఎటువంటి దారుణ ఘటన చోటుచేసుకుంది. నిద్ర పోయిన కొడుకు ని దారుణంగా గొడ్డలితో నరికి చంపాడు ఒక కసాయి తండ్రి.

వివరాల్లోకి వెళితే… ఎన్టీఆర్ జిల్లా,వీరులపాడు మండలంలో శనివారం ఈ దారుణమైన ఘటన చోటుచేసుకుంది. వీరులపాడు గ్రామానికి చెందిన బొల్లెద్దు గాబ్రియేల్ కు ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు. కూతురు ఇద్దరికీ వివాహాలు జరగవు తండ్రీ కొడుకులిద్దరూ గ్రామంలో కలిసి ఉంటున్నారు. మరి మరణించడంతో గాబ్రియేల్ 2007వ సంవత్సరంలో తిరుపతమ్మ అనేది మహిళలు రెండవ వివాహం చేసుకున్నాడు.

గాబ్రియల్ కుమారుడు కిరణ్ ఇంటర్ వరకు చదువు పూర్తి చేసి పెయింటింగ్ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. తిరుపతమ్మ వివాహం చేసుకున్న తర్వాత తరచూ కిరణ్, తిరుపతమ్మ మధ్య గొడవలు జరుగుతూ ఉండేవి.ఈ క్రమంలో వారం రోజుల క్రితం తిరుపతమ్మ కిరణ్ ను ఇంటి నుండి పంపించాలని గాబ్రియేల్ ను ఒత్తిడి చేసింది. ఈ విషయం గురించి ఇద్దరి మధ్య మరొకసారి గొడవ జరిగింది. దీంతో తిరుపతమ్మ పుట్టింటికి వెళ్లిపోయింది.

గాబ్రియల్ కిరణ్ నీ ఇంటి నుండి వెళ్ళిపోమనగా ఇల్లు తనదని , తాను ఎక్కడికి వెళ్లనని తండ్రితో వాదించాడు. కొడుకు ఎదురు చెప్పటంతో తీవ్ర కోపంతో ఉన్న గాబ్రియేల్ శనివారం ఇంట్లో నిద్రపోతున్న కుమారుడి మీద తెల్లవారు జామున గొడ్డలితో నరికాడు.దీంతో తీవ్ర గాయాలపాలైన కిరణ్ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. కొడుకు మృతి చెందటంతో గాబ్రియేల్ పోలీస్ స్టేషన్లో లొంగిపోయాడు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పరిశీలించి కేసు నమోదు చేసుకున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం నందిగామ ఆస్పత్రికి తరలించారు.