Ram Prasaad : రాజమౌళితో ఒకే ఒక్క సినిమా చేసి మళ్లీ చేయకపోవడానికి కారణం అదే.. కెమెరామెన్ రామ్ ప్రసాద్!

Ram Prasaad : రాజమౌళి, సెంథిల్‌ కలిసి ఇప్పటివరకు ఇంకా కంటిన్యూ అవుతున్నారని, తాను మాత్రం మధ్యలో గ్యాప్‌ ఇచ్చి కంటిన్యూ చేయలేదని ప్రముఖ సినీ కెమెరామెన్ రామ్ ప్రసాద్ అన్నారు. నిజం చెప్పాలంటే రాజమౌళి, సెంథిల్‌ది మంచి కాంబినేషన్‌ అన్న ఆయన, తనను ముందు ఓ ఇద్దర్ని ట్రై చేశారని ఆయన తెలిపారు. తన గురించి తెలిసినప్పుడు మాత్రం రాజమౌళి గారు ఒకటే అన్నారని, అదేంటంటే, మీరు చాలా ఫాస్ట్‌గా చేస్తారు. క్వాలిటీ ఇస్తారని అని ఆయన చెప్పారు.

ఎలాగైతేనేంటీ రాజమౌళి గారితో కలిసి పనిచేయడం చాలా పెద్ద విషయం కదా అన్న రామ్ ప్రసాద్ అప్పటికే ఆయన మగధీర చేసి ఉన్నారని చెప్పుకొచ్చారు. అంత పెద్ద డైరెక్టర్‌తో పని చేస్తున్నపుడు ప్రారంభంలో తాను కొంచెం టెన్షన్ పడ్డానని తెలిపారు. ఫస్ట్ షాట్ తీసినపుడు ఆయనకు తనపై చాలా నమ్మకం ఏర్పడిందని రామ్ ప్రసాద్ చెప్పారు. అలాగే ఆయన అనుకున్నట్టు ఏం కావాలో ఆయనకు తాను ఇవ్వగలుగుతానని చెప్పారు. తర్వాత ఆయనతో సినిమా చేయకపోవడానికి కూడా అదే కారణమని ఆ తర్వాత తాను బిజీగా ఉన్నానని, దాని వల్ల తనకు ఆయనతో చేసేందుకు గ్యాప్ ఏర్పడిందని ఆయన తెలిపారు.

ఆ తర్వాత ఈగ సినిమాకు కూడా కొన్ని రోజులు చేయమని రాజమౌళి తనను అడిగారని రామ్ ప్రసాద్ అన్నారు. బాహుబలి సినిమాకు కూడా చివరి సాంగ్‌కు తనను అనుకున్నట్టు విన్నానని ఆయన చెప్పారు. ఇప్పటికీ చాలా మంది మీరు లేరండి అక్కడ అని అంటూ ఉంటారని రామ్ ప్రసాద్ తెలిపారు. అంతే తప్ప ఆయనతో కలిసి చేయడానికి ఇంకే కారణాలు లేవని, ఆయనతో కలిసి పనిచేయడం నిజంగా చాలా బాగా అనిపించిందని ఆయన ఆనందం వ్యక్తం చేశారు. అంతే కాకుండా ఆయన వల్ల చాలా స్కిల్స్ నేర్చుకున్నాని ఆయన వివరించారు.