బ్రేకింగ్: తెలంగాణ మాజీ మంత్రి నాయిని నర్సింహారెడ్డికి కరోనా.. పరిస్థితి విషమం

Telangana ex home minister Naini Narshimha Reddy under critical condition

తెలంగాణ మాజీ మంత్రి నాయిని నర్సింహారెడ్డికి కొన్ని రోజుల కింద కరోనా సోకిన సంగతి తెలిసిందే. ఆయనకు గత బుధవారం కరోనా సోకడంతో వెంటనే ఆయన్ను హైదరాబాద్ లోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

Telangana ex home minister Naini Narshimha Reddy under critical condition
Telangana ex home minister Naini Narshimha Reddy under critical condition

అయితే.. తాజాగా ఆయన పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది. కరోనా సోకడం వల్ల ఆయన ఆరోగ్య పరిస్థితి విషమించినట్టు ఆసుపత్రి వర్గాలు వెల్లడించినట్టు సమాచారం.

ఆయనకు కరోనా సోకిందని తెలియగానే.. నాయిని కుటుంబ సభ్యులంతా హోం క్వారంటైన్ కు వెళ్లారు. అయితే.. ఆయన ఆరోగ్య పరిస్థితి విషమించడంతో కుటుంబ సభ్యులతో పాటు ఆయన అభిమానులు ఆందోళన చెందుతున్నారు. ఆయన ఆరోగ్యానికి సంబంధించిన మిగితా వివరాలు తెలియాల్సి ఉంది.