Telangana Crime: అన్నదమ్ముల మధ్య గొడవ.. మధ్యలో బలైన తండ్రి!

Telangana Crime: ప్రస్తుత కాలంలో అన్నదమ్ముల మధ్య ఆస్తి కోసం, డబ్బు కోసం, ఎన్నో గొడవలు పడుతున్నారు. ఈ గొడవలో ఎంతోమంది హత్యకు కూడా గురవుతున్న సంఘటనలు మనం చూస్తూనే ఉన్నాం. ఇలా అన్నదమ్ములు ఆస్తి కోసం గొడవ పడుతున్న సమయంలో గొడవ మధ్యలోకి తండ్రి వెళ్లడంతో, తండ్రి అని కూడా చూడకుండా తండ్రి బలి తీసుకున్న ఘటన చోటు ఉంది. గరిడేపల్లి మండల పరిధిలోని మంగాపురం తండా గ్రామ పంచాయతీలోని ధరావత్ లాలూకు ఇద్దరు కొడుకులు.ఇద్దరినీ వివాహం అనంతరం వేరు కాపురాలు పెట్టించాడు.

అప్పటి నుంచి ధరావత్ లాలు చిన్న కొడుకు గోపికి అన్ని రకాల సహాయ సహకారాలు అందిస్తున్నాడని పెద్ద కొడుకు సైదులు తన పై కోపం పెంచుకున్నాడు. ఈ క్రమంలోనే అందరూ కలిసి ఉన్నప్పుడు ఒక ట్రాక్టర్ కొనగా, ఆ ట్రాక్టర్ పై డబ్బును పెట్టడంతో ఆ డబ్బును తిరిగి చెల్లించడానికి కొన్ని వాయిదాలు పెట్టారు. కొన్ని వాయిదాలు ముగిసినప్పటికీ డబ్బు చెల్లించకపోవడంతో పెద్ద కొడుకు సైదులు మాట్లాడతాను షెడ్ లో నుంచి బయటకు తీశారు.

మరి చిన్న కొడుకు గోపి అదే ట్రాక్టర్ ను తీసుకెళ్లి షెడ్ లో పెట్టడంతో వీరిద్దరి మధ్య గొడవ చోటుచేసుకుంది. ఇలా ఇద్దరు కొడుకులను విడిపించడం కోసంరావడంతో తన తండ్రి పై ఎంతో కోపం పెంచుకున్న పెద్దకొడుకు పక్కనే ఉన్న తన తండ్రి పై కొట్టాడు. దీంతో అధిక గాయాల పాలైన అతనిని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా అక్కడ ఆయన చికిత్స పొందుతూ మృతి చెందారు. ఈ విషయంపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు కొనసాగిస్తున్నారు.