ఆత్మ విమర్శ చేసుకోమని చంద్రబాబుకు సలహా ఇస్తున్న టీడీపీ తమ్ముళ్లు!! లీడర్స్ పార్టీని పట్టించుకోవడం లేదా!!

Where is Telugudesam party leader Nara Chandrababu Naidu?

2019 ఎన్నికల తరువాత రెండు తెలుగు రాష్ట్రాల్లో టీడీపీ యొక్క పరిస్థితి ఎలా ఉందొ అందరికి తెలుసు. దాదాపు రెండు రాష్ట్రాల్లో తెలుగు దేశం పతనావస్థకు చేరుకుంది. దీనికి కారణం అధికారంలో ఉన్నప్పుడు టీడీపీ నాయకులు ప్రజా ప్రయోజనాల కోసం కాకుండా సొంత ప్రయోజనాల కోసం పాటుపడటం వల్ల ప్రజలకు టీడీపీపై విరక్తి వచ్చింది. అయితే పార్టీకి ఈ పరిస్థితి రావడానికి చంద్రబాబు నాయుడు వ్యక్తిగత ఆత్మ విమర్శ చేసుకోకోపోవడం వల్లే టీడీపీకి ఈ పరిస్థితి వచ్చిందని తెలుగు తమ్ముళ్లే చెప్తున్నారు.

cbn
cbn

బాబు ఆత్మ విమర్శ చేసుకోవడం లేదా!!

రాజకీయం రంగూ రుచి వాసన పూర్వంలా లేవు. ఇది సోషల్ మీడియా కాలం. జనాలకు అన్ని విషయాలూ చాలా బాగా తెలుస్తున్నాయి. మనమేదో అనుకూల మీడియా ద్వారా వండేసి జనం మెదళ్ళలో దాన్ని పంపించి అదే నిజం అనుకోమంటే అసలు కుదిరే కాలం కానే కాదు. కానీ చంద్రబాబు ఇంకా అవుట్ డేటెడ్ పాలిటిక్స్ మాత్రమే చేస్తూ వస్తున్నారు. అలాగే తాను నియమించిన లీడర్స్ పార్టీ కోసం ఎంత వరకు పని చేస్తున్నారో కూడా బాబు చూసుకోవడం లేదు. ఆయనకు ఎంత సేపూ ఆత్మ స్తుతి. పరనింద అలవాటు అన్నది తెలిసిందే. జగన్ ని మెల్లగా జనంలో చెడ్డ చేస్తే చాలు అధికారం అదే వచ్చి వడిలో పడుతుందని పాతకాలం నాటి రాజకీయ పట్లతో బాబు పోరాడుతున్నారు. ఇలా చంద్రబాబు తనను తాను పొగుడుకుంటూ ఆత్మ విమర్శ చేసుకోవడం లేదని టీడీపీ తమ్ముళ్లే బాబుకు సలహా. ఇస్తున్నారు.

ఆ ధీమా మంచిదేనా..?

ఏపీలో జగన్ బదనాం అయితే కచ్చితంగా జనం టీడీపీనే ఎన్నుకుంటారని చంద్రబాబుకు ఉన్న అతి ధీమాగా కనిపిస్తోంది. కానీ రెండు రెళ్ళు నాలుగు అన్నది అంకె గణితం. రాజకీయ గణితంలో ఒక్కోసారి ఆరు కూడా కావచ్చు. ఇపుడు ఏమీ కాకుండా పోయిన జనసేన, బీజేపీ కూటమి కూడా రేపటి రోజున ఏపీలో గట్టిగానే పుంజుకోవచ్చు. అపుడు ఆ పార్టీ వైపుగానూ ప్రజలు చూసే ఛాన్సు కూడా ఉంటుంది. ఇక పార్టీలో తప్పు ఒప్పులు సరి చేసుకుని జనాలకు గట్టి భరోసా ఇవ్వకపోతే 2019లో ఓడించిన టీడీపీనే మళ్లీ నెత్తిన పెట్టుకోవడానికి ఆంధ్ర ప్రజలు ఎందుకు ముందుకు వస్తారు అన్నది కూడా ఆలోచించాలి కదా. కానీ చంద్రబాబు అర్భాటంగా పొలిట్ బ్యూరో మీటింగులు రాష్ట కమిటీ మీటింగులు పెడతారు కానీ అసలు విషయాలను మాత్రం అలా కావాలనే వదిలేస్తారు అంటున్నారు.