Balakrishna: అన్ స్టాపబుల్ షో తర్వాత బాలయ్యతో ఫోటోలు దిగడానికి చూస్తుంటే… బాలయ్య ఏం చేశారంటే: సురభి

Balakrishna: నిజం చెప్పాలంటే బాలయ్య బాబుని చూసి అందరూ భయపడుతారని, ఆయన్ని దగ్గర్నుంచి చూస్తే మాత్రం ఎవరూ ద్వేశించరని సురభి జయానంద్ తెలిపారు. ఇటీవల ప్రారంభమైన అన్ స్టాపబుల్ షో ద్వారా బాలకృష్ణ గారి మనస్తత్వం ఏంటో అందరికీ తెలిసిందని ఆయన చెప్పారు. కృష్ణుడి ప్రోమో ప్లే కాగానే ఆయన చూసి, గెటప్ బాగుందయ్యా అని పొగిడారని జయానంద్ అన్నారు.

ఇకపోతే బాలకృష్ణను చూస్తే ఒక రకంగా భయం వేస్తుందని, కానీ ఆయన అందరితోనూ చాలా బాగా మాట్లాడుతారని జయానంద్ అన్నారు. అన్ స్టాపబుల్ షో షూటింగ్ అయ్యాక కూడా తాను ఆయన్ని కలిశానని ఆయన చెప్పారు. అక్కడ ఆయనతో ఫొటో దిగడానికి దాదాపు 300 మంది ఉన్నారని ఆయన తెలిపారు.

కాగా ఆయనకు అప్పటికీ నిద్ర లేదు. కానీ షూట్ అయిపోగానే డ్రెస్ చేంజ్ చేసుకొని వచ్చి అడిగిన ప్రతీ ఒక్కరికీ ఫొటో ఇచ్చారని ఆయన తెలిపారు. ఆ తర్వాత మళ్లీ ప్రోమో షూట్స్ చేశారని, అంతే కాకుండా అక్కడ లోపల ఉన్న తనకు, ఇంకా ఆహా టీమ్ కి ఫొటోస్ ఇచ్చారని ఆయన అన్నారు. అంటే ఆయనకు ఎంత ఓపిక కదా అని, నిజం చెప్పాలంటే ఆయన మనసులో ఏం దాచుకోరని, కల్మషం లేని వ్యక్తి అని జయానంద్ తెలిపారు. అంతే కాకుండా ఆయన ఇటీవల ఒక ప్రోగ్రామ్‌లో చెప్పినట్టు కోపం అనేది ఔట్ ఆఫ్ సిలబస్ అన్నది చాలా నిజమని ఆయన స్పష్టం చేశారు.