Crime News: మైనర్ బాలికపై పెంపుడు తండ్రి దారుణం..బాలిక అనారోగ్యం పాలవడంతో వెలుగులోకి వచ్చిన అసలు నిజాలు..!

Crime News: ప్రస్తుత కాలంలో ఆడపిల్లలకు బయట ప్రపంచంలో భద్రత లేకుండా పోతోంది.సమాజంలో రోజురోజుకు మహిళల మీద , బాలికల మీద అత్యాచారాలు పెరిగిపోతున్నాయి . ఇటువంటి అత్యాచారాలకు అడ్డుకట్ట వేయడానికి ప్రభుత్వాలు కఠిన చర్యలు తీసుకున్నా ఇటువంటి సంఘటనలు మాత్రం జరుగుతూనే ఉన్నాయి.ఇటీవల హైదరాబాద్ నగర శివార్లలో ఇటువంటి దారుణ సంఘటన చోటు చేసుకుంది.మైనర్ బాలికపై పెంపుడు తండ్రి అత్యాచారానికి పాల్పడిన ఘటన ప్రస్తుతం కలకలం రేపుతోంది.

వివరాలలోకి వెళితే…దుండిగల్‌ పరిధిలోని మల్లంపేటలో నివాసం ఉంటున్న ఒక మహిళ భర్తతో విడిపోయి గత పది సంవత్సరాలుగా మరో వ్యక్తితో మల్లంపేటలో సహజీవనం చేస్తున్నది. సదరు మహిళకు 12 ఏండ్ల వయస్సున్న కూతురు ఉన్నది. బాలికపై కన్ను పడిన పెంపుడు తండ్రి సదరు మహిళకు తెలియకుండా ఆ మైనరు బాలికపై గత కొన్ని రోజులుగా అత్యాచారం చేస్తున్నాడు. ఈ విషయం బయటికి చెప్తే చంపేస్తానని బాలికను బెదిరించడంతో భయంతో బాలిక ఈ విషయం తన తల్లికి చెప్పకుండా మౌనంగా ఉండిపోయింది.

ఈ క్రమంలో ఇటీవల ఆ చిన్నారి ఆరోగ్యం క్షీణించడంతో.. తల్లి ఆమెను దవాఖానకు తీసుకెళ్లింది. అక్కడ బాలికను పరీక్షించిన వైద్యులు ఆమె గర్భవతి అని నిర్ధారించారు. తల్లి బాలికను నియడంతో అసలు విషయం బయటపడింది. తను ఇంట్లో లేని సమయంలో పెంపుడు తండ్రి బాలికపై లైంగిక దాడికి పాల్పడినట్టు తెలిసింది. దీంతో సదరు మహిళ దుండిగల్‌ పోలీసులను ఆశ్రయించి ఆ వ్యక్తి మీద పిర్యాదు చేసింది. ఘటనకు సంబంధించి కేసు నమోదుచేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.