టాలీవుడ్ స్టార్ హీరో బాలయ్యకు కోపం ఎక్కువని ప్రచారంలో ఉన్నా ఆయన గురించి తెలిసిన వాళ్లు మాత్రం ఆయన మనస్సు బంగారం అని చెబుతారు. బాలయ్య నిర్మాతల పాలిట కూడా మంచితనంతో వ్యవహరిస్తారని అందువల్లే ఆయనతో పని చేయడానికి ఎక్కువమంది నిర్మాతలు ఆసక్తి చూపుతున్నరని సమాచారం. స్టార్ హీరో బాలకృష్ణ భోజన ప్రియుడు కూడా కావడం గమనార్హం. బాలయ్య హోస్ట్ గా కూడా మెప్పించారని సమాచారం.
గోపీచంద్ మలినేని, అనిల్ రావిపూడి దర్శకత్వంలో నటిస్తున్న బాలయ్య బీవీఎస్ రవి, బోయపాటి శ్రీను డైరెక్షన్ లో చెరో సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని సమాచారం అందుతోంది. అయితే బాలయ్య ఏ వారం ఏయే వంటకాలు తినాలో లిస్ట్ సిద్ధం చేసి వంటకాలను వంటవాడివి చెబుతారు. ప్రతి మంగళవారం రోజున బాలయ్య తనకు ఇష్టమైన వంటకాలను లిమిట్ లేకుండా తింటారు. అన్ స్టాపబుల్ షోలో భాగంగా భాగంగా బాలయ్య ఈ విషయాలను చెప్పుకొచ్చారు.
బాలయ్యకు చికెన్ బిర్యానీ ఎంతో ఇష్టమైన ఫుడ్ కాగా రొయ్యలను కూడా బాలయ్య ఎంతో ఇష్టంగా తింటారు. ప్రాంతాన్ని బట్టి అక్కడ ఫేమస్ అయిన వంటకాలను తినడానికి బాలయ్య ఆసక్తి చూపుతారు. మరోవైపు అఖండ సక్సెస్ తో బాలయ్య సినిమాల బడ్జెట్ పెరిగిందని తెలుస్తోంది. ఒక్కో సినిమాకు బాలయ్య ప్రస్తుతం 12 కోట్ల రూపాయల రేంజ్ లో పారితోషికంను అందుకుంటున్నారు.
బాలయ్యను చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ల వరకు అందరూ ఎంతగానో అభిమానిస్తారు. బాలయ్య పిల్లలను ఎంతగానో అభిమానిస్తారు. కాలానికి అనుగుణంగా మారే హీరోలలో బాలయ్య ముందువరసలో ఉంటారు. ప్రస్తుతం నటిస్తున్న సినిమాలు సక్సెస్ సాధిస్తే బాలయ్య రేంజ్ మరింత పెరగడం గ్యారంటీ అని ఇండస్ట్రీలో వినిపిస్తోంది. పొలిటికల్ గా కూడా బాలయ్య యాక్టివ్ గా ఉంటున్నారనే సంగతి తెలిసిందే.
