Sri Reddy: ఆ విషయంలో తప్పు చేశాను అంటూ పశ్చాత్తాప పడిన శ్రీ రెడ్డి?

Sri Reddy: తెలుగు సినీ ప్రేక్షకులకు శ్రీరెడ్డి గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. ఈమె హాట్ ఫోటోలు వీడియోలు తోపాటు వివాదాస్పద పోస్టులతో సంచలనంగా మారిన శ్రీ రెడ్డి నిత్యం ఎవరినో ఒకరిని టార్గెట్ చేస్తూ వార్తల్లో నిలుస్తూనే ఉంటుంది. అంతే కాకుండా కాస్టింగ్ కౌచ్ విషయంలో కూడా ఈమె బాగా పాపులర్ అయ్యింది. ఇది ఇలా ఉంటే ఎప్పటిలాగే ఏదో ఒక వార్తతో సోషల్ మీడియాలో నిలిచే శ్రీ రెడ్డి తాజాగా మరోసారి వార్తల్లో నిలిచింది. గతంలో ఒక సారి చిరంజీవి తల్లిని దూషిస్తూ పలు వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. అయితే చిరంజీవి తల్లిని దూషిస్తూ తాను చేసిన వ్యాఖ్యలపై పశ్చాత్తాపం వ్యక్తం చేసింది.

బుద్ధి గడ్డి తిని తాను తప్పు చేశానని, పెద్ద మనసు చేసుకొని క్షమించాలి అని కోరింది. ఈ మేరకు ఆ విషయంలో పశ్చాత్తాప పడుతూ ట్విట్టర్లో ఒక వీడియోను కూడా రిలీజ్ చేసింది. ఆడవారి కోసం నేను చేసిన ఉద్యమంలో న్యాయం కోసం ఒక పెద్ద మనిషి ఇచ్చిన సలహాల వల్ల నేను మెగాస్టార్ చిరంజీవి గారి తల్లి అంజనమ్మ ని తిట్టాల్సి వచ్చింది. ఆ ఈ విషయంలో ఏ మాత్రం సంబంధం లేని ఆమెను తిట్టడం ముమ్మాటికీ తప్పే. దానికి నేను శిక్ష కూడా అనుభవించాను.. అంతేకాకుండా సోషల్ మీడియాలో ట్రోల్స్ కూడా ఎదుర్కొన్నాను. అంతేకాకుండా చాలా మంది కాల్ చేసి మరీ అలా మాట్లాడి ఉండకూడదు అని చెప్పారు అని చెప్పుకొచ్చింది.

 

అయితే ఈ విషయంలో ఇప్పటికీ తాను బాధపడుతూనే ఉన్నాను అని చెప్పుకొచ్చింది శ్రీరెడ్డి. అన్యాయంగా ఆమెను తిట్టడం తప్పే. ఒప్పుకుంటున్నాను. నేను తప్పు చేశాను.. బుద్ధి గడ్డి తిని అలా ప్రవర్తించాను.. పెద్ద మనసు చేసుకొని నన్ను క్షమించండి అంటూ శ్రీరెడ్డి ఆ వీడియోలో తెలిపింది. ఆ వీడియోని షేర్ చేస్తూ నన్ను క్షమించండి అంజనమ్మ అని క్యాప్షన్స్ జోడించింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.