ప్రబాస్ స్పీడు మామూలుగా లేదుగా.!

దాదాపు 400 కోట్ల బడ్జెట్ సినిమా. అందులోనూ త్రీడీ టెక్నాలజీ. రామాయణ పురాణ గాధ ఆధారంగా తెరకెక్కిన పౌరాణిక చిత్రం.. అన్నింటికీ మించి ప్యాన్ ఇండియా స్థాయి మూవీ. ఇన్ని స్పెషల్ క్వాలిటీస్ ఉన్న సినిమా ‘ఆదిపురుష్’‌ షూటింగ్ పూర్తయిపోయిందట. కేవలం 103 రోజుల్లోనే ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసేశారట.

నిజంగా ఇది ఆశ్చర్యం కలిగించే విషయమే. ప్రబాస్ హీరోగా ప్యాన్ ఇండియా రేంజ్‌లో తెరకెక్కుతోన్న మూవీ ‘ఆది పురుష్’. బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్ ఈ సినిమాకి దర్శకత్వం వహించారు. కృతిసనన్ హీరోయిన్‌గా రాముని భార్య సీత పాత్ర పోషించింది. రామాయణానికి అతి కీలకమైన రావణ బ్రహ్మ పాత్రలో బాలీవుడ్ నటుడు సైఫ్ అలీ ఖాన్ కనిపించనున్నారు.

కాగా, ఈ సినిమా షూటింగ్ మొత్తం కంప్లీట్ అయిపోయిందని ప్రకటిస్తూ తాజాగా చిత్ర యూనిట్ ఓ గ్రూప్ ఫోటో రిలీజ్ చేసింది. ఈ ఫోటో ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతుండగా, ఇంత స్పీడ్‌గా తమ అభిమాన హీరో ప్రబాస్ సినిమా పూర్తయిపోయినందుకు సంతోషం వ్యక్తం చేస్తున్నారు ఆయన ఫ్యాన్స్. అలాగే తొందరగా ప్రబాస్ ఫస్ట్ లుక్ కూడా రిలీజ్ చేయమని డైరెక్టర్‌కి ఫ్యాన్స్ రిక్వెస్ట్ చేస్తున్నారు.