పాపం ప్రభాస్ దర్శకుడు..ఇప్పటికీ భయం పోలేనట్టుంది..!

Prabhas Fans

Prabhas Fans : ఈ ఏడాది ఎన్నో అంచనాలు నెలకొల్పుకొని పాన్ ఇండియా లెవెల్లో రిలీజ్ అయ్యిన చిత్రం “రాధే శ్యామ్”. ఈ ఏడాదికి ఫస్ట్ పాన్ ఇండియన్ నోటెడ్ సినిమా ఇదే కాగా ఈ సినిమా రిలీజ్ అయ్యాక వచ్చిన ఫలితం బాగా నిరాశపరిచింది. దీనితో ఈ సినిమా దర్శకుడు అయితే కొన్ని రోజులు ఏం మాట్లాడలేదు.

ప్రభాస్ లాంటి హీరో అవకాశం ఇస్తే దాన్ని దర్శకుడు రాధా కృష్ణ వేస్ట్ చెయ్యడమే కాకుండా ప్రభాస్ అభిమానుల ఆగ్రహానికి లోనయ్యాడు. మరి దీనితో ఈ సినిమా డిజాస్టర్ ఎఫెక్ట్ లో ఈ దర్శకుడు ఇంకా ఉన్నాడని చెప్పాలి. ఇప్పటికీ కూడా తన సోషల్ మీడియాలో ప్రభాస్ ఫ్యాన్స్ ని ఎదుర్కొనే సాహసం చేయలేకపోతున్నాడు.

రీసెంట్ గా పెట్టిన ట్వీట్స్ లో అయితే అసలు వాటికి రిప్లై ఆప్షన్ నే పెట్టట్లేదు. దీనితో అతడు ఎంతలా భయపడుతున్నాడో అర్ధం చేసుకోవచ్చు. లేటెస్ట్ గా సర్కారు వారి పాట సినిమాని ఆ సినిమా యూనిట్ ని పొగుడుతూ పోస్ట్ పెట్టగా దానికి కూడా కామెంట్స్ ఆప్షన్ తీసేసాడు.

దీనితో మరోసారి మళ్ళీ అందరికి కన్ఫర్మ్ అయ్యింది. ఒకవేళ ఆన్ చేసి ఉంటే ప్రభాస్ ఫ్యాన్స్ ఆగ్రహాన్ని తట్టుకోలేడని. పాపం మరి ఇంకా ఎన్నాళ్ళు ఇలా ఉంటాడో అతనికే తెలియాలి. అలాగే ప్రస్తుతానికి అయితే తాను మరే ఇతర ప్రాజెక్ట్ కూడా టేకప్ చెయ్యలేనట్టే తెలుస్తుంది.