Geetha Madhuri: నేను సెకండ్ హ్యాండ్ అంటూ షాకింగ్ కామెంట్స్ చేసిన సింగర్ గీత మాధురి..!

Geetha Madhuri:టాలీవుడ్ ప్లేబ్యాక్ సింగర్ గా ఎంతో మంచి పేరు సంపాదించుకున్న సింగర్ గీత మాధురి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈమె ఎన్నో అద్భుతమైన పాటల ద్వారా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకోవడమే కాకుండా బిగ్ బాస్ సీజన్ 2 కంటెస్టెంట్ గా వెళ్లి రన్నర్ గా నిలిచారు.ఇలా బిగ్ బాస్ కార్యక్రమం ద్వారా మరింత పాపులారిటీ దక్కించుకున్న గీతామాధురి తాజాగా ఈ కార్యక్రమం గురించి షాకింగ్ కామెంట్స్ చేశారు.ప్రస్తుతం తెలుగులో ఐదో సీజన్లో ను పూర్తి చేసుకున్న ఈ కార్యక్రమం ఈనెల 26వ తేదీ నుంచి డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో 24 గంటల పాటు ప్రసారం కానున్న సంగతి మనకు తెలిసిందే .

ఈ క్రమంలోని ఇదివరకు బిగ్ బాస్ కార్యక్రమంలో పాల్గొన్న కొందరు కంటెస్టెంట్ లను తిరిగి ఓటీటీ ప్రసారం కానున్న ఈ కార్యక్రమానికి తిరిగి తీసుకురావాలని నిర్వాహకులు భావించినట్లు తెలుస్తోంది. అయితే ఇప్పటికే కొందరి పేర్లు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.ఈ క్రమంలోనే బిగ్ బాస్ కంటెస్టెంట్ గా సీజన్ 2 లో పాల్గొన్న గీతామాధురి ఈ కార్యక్రమం పై మాట్లాడుతూ మీకు కనుక ఈ అవకాశం వస్తే తిరిగి ఈ కార్యక్రమానికి వెళ్తారా అంటూ ప్రశ్నించారు. ఈ ప్రశ్నకు గీతామాధురి సమాధానం చెబుతూ షాకింగ్ కామెంట్ చేశారు.

నేను ఇదివరకే బిగ్ బాస్ కార్యక్రమానికి వెళ్లానని ప్రస్తుతం తాను సెకండ్ హ్యాండ్ అయిపోయానని ఈ కార్యక్రమానికి వెళ్లినా నన్ను ఎవరు చూడరని ఆమె తన అభిప్రాయాన్ని వెల్లడించారు.అదే విధంగా తనకు చిన్న పాప కూడా ఉందని తనని వదిలి ఒక్క క్షణం కూడా ఉండలేను అందుకే ఈ కార్యక్రమానికి వెళ్ళలేను అంటూ సమాధానం చెప్పారు. ఇక ఈ కార్యక్రమానికి వెళ్లే కంటెస్టెంట్ లకు గీతామాధురి కొన్ని సలహాలు సూచనలు చేశారు. ప్రస్తుతం బిగ్ బాస్ కార్యక్రమం గురించి ఈమె చేసిన ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.