Geetha Madhuri: ప్రవస్తి వివాదం పై స్పందించిన గీతా మాధురి…అండగా ఉంటాము అంటూ!

Geetha Madhuri: పాడుతా తీయగా కార్యక్రమం గురించి సింగర్ ప్రవస్తి చేసిన వ్యాఖ్యలు తీవ్రదుమారం రేపుతున్నాయి. ఇక ఈ వివాదం పై ఇప్పటికే పలువురు సెలబ్రిటీలు కూడా స్పందిస్తున్న సంగతి తెలిసింది. తాజాగా ఈ వివాదం గురించి సింగర్ గీత మాధురి కూడా స్పందించారు. ఈ సందర్భంగా గీతామాధురి ఒక వీడియోని విడుదల చేసారు. దీంతో ఈ వీడియో కాస్త వైరల్ అవుతుంది.

ఈ వీడియోలో గీతామాధురి మాట్లాడుతూ… సింగర్ ప్రవస్తి చేసిన ఆరోపణలు చూసి చాలా బాధగా అనిపించింది. ఆమె మెంటల్ ప్రెషర్ లో ఉంది. ఇప్పటికే ఆమె చాలా కాంపిటీషన్స్ లో పాడింది. కాబట్టి ఆమెపై చాలా మెంటల్ ప్రెషర్ పెరిగి అలా మాట్లాడి ఉండొచ్చని నేను అనుకుంటున్నాను. ప్రవస్తి నీకు ఒకటే విషయం చెబుతున్నాను. ఒక షోలో గెలవలేక పోయినంత మాత్రాన నీ పని అయిపోయినట్టు కాదు. దాన్ని గుర్తు పెట్టుకో. ప్రతి దాన్ని సీరియస్ గా తీసుకోవద్దు. నీ హార్ట్ లోకి తీసుకుని ఇలా మాట్లాడవద్దు.

ఇండస్ట్రీలో గెలుపు, ఓటములు అనేది సర్వసాధారణం. ఈ మాత్రాన నీకు పాడటం రాదని కాదు. నీకు మేమంతా అండగా ఉంటాం. నీకు ఎప్పుడు కావాలంటే అప్పుడు మద్దతు ఇవ్వడానికి మేము రెడీగా ఉంటున్నాం. నాకు తెలిసి కీరవాణి గారు, సునీత, చంద్రబోస్ అయితే అలాంటివారు కాదు. వారిని దగ్గరనుంచి చూస్తూ ఉన్నాను వారు ఒకరి మంచి కోరుకునే వారు తప్ప చెడు మాత్రం అసలు కోరుకోరు.

ఆ షోలో నువ్వు పాడిన పాట వారికి నచ్చలేదేమో. అంతే గానీ నువ్వు నచ్చలేదని కాదు. వాళ్లు ఎంతోమంది సింగర్లను ప్రోత్సహిస్తూ వచ్చారు. కాబట్టి ఇలాంటి వాటిని పట్టించుకోకుండా కెరియర్ పై దృష్టి సారించు కానీ ఇలాంటి వాటిని పట్టించుకోని నీ జీవితాన్ని నాశనం చేసుకోవద్దు అంటూ సింగర్ గీతామాధురి ప్రవస్తికి సలహాలు ఇస్తూ చేసిన ఈ వీడియో వైరల్ అవుతుంది.