రష్మి కోసం 32 సార్లు ఫోన్ చేసిన గీతామాధురి భర్త నందు… ఎందుకంటే?

బుల్లితెర మీద గ్లామరస్ యాంకర్ గా గుర్తింపు పొందిన రష్మీ గౌతమ్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు.ఇండస్ట్రీలో అడుగుపెట్టి సినిమాలలో చిన్న చిన్న పాత్రలలో నటించిన రష్మీ జబర్దస్త్ లో యాంకర్ గా అవకాశమందుకొని సినిమాల కంటే జబర్దస్త్ ద్వారానే మంచి గుర్తింపు పొందింది. ఇలా ప్రస్తుతం జబర్దస్త్, ఎక్స్ ట్రా జబర్దస్త్ , శ్రీదేవి డ్రామా కంపెనీ వంటి మూడు కామెడీ షో లలో యాంకర్ గా వ్యవహరిస్తూ బిజీగా ఉన్నా రష్మి సినిమాలలో కూడా నటిస్తోంది. ఇదిలా ఉండగా ఇటీవల సింగర్ గీత మాధురి భర్త నందు రష్మి కోసం వెతుకుతూ స్టూడియో కి వచ్చి రచ్చ చేశాడు.

అందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియో లో రష్మి కోసం ఎన్నో సార్లు ఫోన్ చేసినా కూడా ఆమె ఫోన్ ఎత్తటం లేదని నందు రచ్చ చేశాడు. అసలు విషయానికి వస్తే… నందు, రష్మీ జంటగా బ్లాక్ బస్టర్ అనే సినిమాలో నటించారు. రెండేళ్ల క్రితం ప్రారంభమైన ఈ సినిమా కరోనా కారణంగా వాయిదా పడుతూ వచ్చింది. తాజాగా ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసుకొని విడుదలకు సిద్దంగా ఉంది. ఈ క్రమంలో సినిమా ప్రమోషన్ పనులు మొదలు పెట్టాలని చిత్ర యూనిట్ భావించారు.

ఈ క్రమంలో రష్మి కి 32 సార్లు ఫోన్ చేసినా కూడా ఆమె ఫోన్ తేయకపోవటంతో నందు ఆమె ఉన్న ఫోటో స్టూడియోకి వెళ్లి రచ్చ చేస్తు ఎందుకు ఫోన్ తీయటం లేదు అని గట్టిగా అడిగాడు. దీంతో రష్మి స్పందిస్తూ… సినిమా లో స్టోరీ, స్క్రీన్ప్లే మంచిగా ఉండాలి, పెర్ఫార్మన్స్ కూడా బాగుండాలి, లేకపోతే అందరూ ఏవేవో కామెంట్స్ పెడతారు అంటూ వెల్లడించింది. అయితే నందు, దర్శకుడు ఇద్దరూ ఈ సినిమాలో మీరు చెప్పేవి అన్నీ ఉన్నాయని రష్మి కి నచ్చచెప్పే ప్రయత్నం చేశారు. ఆఖరికి ప్రమోషన్స్ కి వెళ్ళటానికి రష్మి అంగీకరించింది. అయితే ఈ తతంగం అంతా కూడా సినిమా ప్రమోషన్స్ లో భాగంగానే చేశారని అర్థమయ్యింది.