Shriya Saran: మనం సినిమా తర్వాత చనిపోతానని ముందే చెప్పిన ఏఎన్ఆర్?

Shriya Saran: సంజన రావు అనే కొత్త దర్శకుడు ఇండస్ట్రీకి పరిచయం అవుతూ..క్రియ ఫిల్మ్ కార్ప్, కలి ప్రొడక్షన్స్ బ్యానర్లు సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం గమనం. ఇందులో శ్రియా సరన్, శివ కందుకూరి, ప్రియాంక జవాల్కర్, నిత్యా మీనన్ ప్రధాన పాత్రలలో నటించారు. సినిమా డిసెంబర్ 10వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ క్రమంలోనే పెద్దఎత్తున ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలను చేపట్టారు. ఈ సందర్భంగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న శ్రీయ ఎన్నో ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు. తనని ఇండస్ట్రీలో ప్రేక్షకులు ఎంతో గొప్పగా ఆదరించారని, ప్రేక్షకాదరణ వల్ల ప్రస్తుతం ఈ స్థాయిలో ఉండగలిగాను అని తెలిపారు.

ఈ క్రమంలోనే తను చనిపోయేవరకు సినిమాలలో నటిస్తూ తన కూతురు, తన కుటుంబం గర్వించదగ్గ సినిమాలలో నటిస్తానని తెలిపారు. నేను ఎంతవరకు బతికివుంటానో అంతవరకూ సినిమాలలో నటిస్తానని సినిమాలు చూస్తూ గడుపుతానని ఈమె తెలిపారు. సీనియర్ నటుడు ఏఎన్నార్ గారు చివరి క్షణాల వరుకు నటించారు.మనం సినిమా షూటింగ్ సమయంలో ఒకవేళ నేను చనిపోతే ఈ సినిమా పూర్తి చేసిన తర్వాత చనిపోతానని ఎప్పుడు అనేవారని ఈ సందర్భంగా శ్రియ తెలిపారు.

అలా నేను కూడా నా చివరి క్షణాల వరకూ సినిమాల్లో నటిస్తానని తెలిపారు. ఏ పాత్ర చేసినా మనసుకు నచ్చే విధంగా ఉండాలని మనం సినిమాలో నా పాత్ర అలాగే ఉందని ఇందులో నా పాత్ర దివ్యాంగురాలు పాత్రలో నటించాలని ఈ సినిమా కథ విన్న సమయంలో నీళ్లు తిరిగాయని ఈ సినిమా కథ వినగానే ఒక్కమాట కూడా మాట్లాడకుండా సినిమాకి ఓకే చెప్పానని ఈ సందర్భంగా శ్రీయ గమనం సినిమా గురించి తెలియజేశారు.