Boyapaati Srinu: అఖండ సినిమా కోసం బోయపాటి తీసుకున్న రెమ్యునరేషన్ ఎంతో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే!

Boyapaati Srinu: ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో సినిమాల రేంజ్ మారిపోయింది.ఈ క్రమంలోనే అత్యంత భారీ బడ్జెట్ తో సినిమాలను తెరకెక్కించడంలో కాకుండా హీరోహీరోయిన్లకు కోట్ల రెమ్యునరేషన్ చెల్లిస్తున్నారు.ఇక బాలకృష్ణ-బోయపాటి కాంబినేషన్లో ఇది వరకే సింహా లెజెండ్ వంటి చిత్రాలు బాక్సాఫీస్ వద్ద అద్భుతమైన విజయాలను అందుకున్నాయి. ఈ క్రమంలోనే వీరిద్దరి కాంబినేషన్లో వస్తున్న మూడో సినిమా కోసం బోయపాటి భారీ మొత్తంలో రెమ్యూనరేషన్ తీసుకుని ఉంటారని చాలామంది భావిస్తున్నారు.నిజానికి ఈ సినిమా కోసం బోయపాటి శ్రీను తీసుకున్న రెమ్యునరేషన్ ఎంతో తెలిస్తే ప్రతి ఒక్కరు షాక్ అవుతారు.

బోయపాటి శీను దర్శకత్వంలో రామ్ చరణ్ హీరోగా తెరకెక్కిన చిత్రం వినయ విధేయ రామ. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ కావడంతో ఈ సినిమా నిర్మాత ఇండస్ట్రీని వదిలి పెట్టే పరిస్థితులు ఏర్పడ్డాయి. ఇక అఖండ సినిమా విషయంలో బోయపాటి రెమ్యునరేషన్ గురించి పెద్దఎత్తున చర్చలు జరిగాయి. ఈ క్రమంలోనే బోయపాటి శ్రీను ఈ సినిమా కోసం ఒక్క రూపాయి కూడా రెమ్యునరేషన్ తీసుకోకుండా ఈ సినిమాకి పనిచేశారు.

ఈ సినిమా విడుదల అయ్యి ఎలాంటి ఫలితాలను అందుకుంటుందో తెలుసుకున్న తర్వాత వచ్చే లాభాలలో తనకు ఇంత పర్సెంటేజ్ కావాలని ఈ సినిమా డిజాస్టర్ అయితే తనకు రెమ్యునరేషన్ వద్దని ఒక రూపాయి కూడా తీసుకోకుండా పని చేశారు.ఇక ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద అద్భుతమైన విజయాన్ని అందుకోవడంతో ముందుగా కుదుర్చుకున్న డీలింగ్ ప్రకారం ఈ సినిమా లాభాలలో తనకు పర్సెంటేజ్ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. ఏది ఏమైనా బోయపాటి తనపై నమ్మకం కలగటానికి ఇలా రూపాయి కూడా రెమ్యునరేషన్ తీసుకోకుండా సినిమా చేయడం ఎంతో గొప్ప విషయం.