అలాంటి వాళ్ళను అస్సలు వదలను అంటున్న శర్వానంద్

టాలీవుడ్ లో ఉన్న టాలెంటెడ్ నటుల్లో శర్వానంద్ ఒకరు. ‘ప్రస్థానం’, ‘మళ్ళీ మళ్ళీ ఇది రాణి రోజు’, లాంటి ఫీల్ గుడ్ సినిమాలతో పాటు ‘రన్ రాజా రన్’, ‘ఎక్ష్ప్రెస్స్ రాజా’ లాంటి కామెడీ ఎంటెర్టైనెర్స్ తో కూడా ఎంటర్టైన్ చేసాడు శర్వానంద్. కానీ ఈ మధ్య అంతగా సక్సెస్ లేదు.

ఎప్పుడూ కాంట్రవర్సీలకు దూరంగా ఉండే శర్వానంద్ తాజాగా చేసిన కామెంట్ వైరల్ అవుతుంది. తాజా ఇంటర్వూలో కొన్నాళ్ల క్రితం ఓ నిర్మాతతో పారితోషకం విషయంలో వచ్చిన వివాదం గురించి ప్రస్తావించినపుడు శర్వా ఈ విధంగా సమాధానం ఇచ్చారు.

రెమ్యూనిరేషన్ పూర్తిగా ఇవ్వకుండా డబ్బింగ్ కూడా చెప్పరని, అలాంటిది తాను అన్నీ పూర్తి చేస్తే, తప్పుడు లెక్కలు చెప్పి, కార్లు కొనుక్కుంటే తాను ఎలా సహిస్తానని అన్నారు. అదే విధంగా తనను తాను అండర్ సేల్ చేసుకోనని, తన మార్కెట్ తన నిర్మాతలకు తెలుసు అని దానికి ప్రకారమే తన  రెమ్యూనిరేషన్ వుంటుందని శర్వా అన్నారు.

వరుస షూటింగ్ లతో బిజీ కావడం, తన ప్రమాదం కారణంగా పలు రకాల మందులు వాడడం, స్వతహాగా ఏది పడితే అది తినేయడం వల్ల 90 కిలోల వరకు బరువు పెరిగానని, ఈ విషయం తాను గమనించాను, మిత్రులు కూడా చెప్పారని, దాంతో ఎనిమిది నెలలుగా కాస్త గ్యాప్ తీసుకుని, మేకోవర్ అయ్యా అని శర్వానంద్ చెప్పారు.

తన కెరీర్ లో కొన్ని సినిమాలు ఫ్లాప్ అయ్యాయని, కొన్ని హిట్ అయ్యాయని, ఏమైనా ఇన్నేళ్లుగా ఇండస్ట్రీలో వున్నానని అది కీలకమని ఆయన అన్నారు. ఏ సినిమా చేయాలి, ఏది చేయకూడదు అనే డైలమా ఎప్పుడూ వుంటుందని, కానీ ఒకటి మాత్రం వాస్తవమని, మంచి పాత్రలు ఏవీ తాను వదులుకోలేదని, అందువల్లే ఇండస్ట్రీలో తనకంటూ ఓ పేరు, ఓ స్థానం వుందని శర్వానంద్ అన్నారు.

ఇప్పుడొస్తున్న తన సినిమా  ‘ఒకే ఒక జీవితం’ కథ చాలా గొప్పది అని, అస్సలు అలాంటి ఆలోచన అసలు రావడమే గ్రేట్ అని అన్నారు. తాను, వెన్నెల కిషోర్, ప్రియదర్శి ముగ్గురం టైమ్ మెషీన్ తో వెనక్కు వెళ్తామని, అలా వెళ్లి ఎవరికి వారు ఏం చేసారు అన్నది కీలకమన్నారు. తన పాత్ర మాత్రం కోల్పోయిన తల్లిని కలుసుకుంటుందని, ఇది నిజంగా చాలా ఎమోషనల్ పాయింట్ అని శర్వానంద్  అన్నారు.