షాకింగ్ : నేనింకా చావలేదు..సమంత ఎమోషనల్ కామెంట్స్.!

సౌత్ ఇండియా టాప్ స్టార్ హీరోయిన్స్ లో సమంత కోసం అందరికీ తెలిసిందే. అయితే సమంత ఇప్పుడు నటిస్తున్న చిత్రాల్లో దర్శకుడు హరి – హరీష్ దర్శకత్వం వహించిన చిత్రం “యశోద” కూడా ఒకటి. మరి ఈ సినిమా రిలీజ్ కి దగ్గర పడుతుండగా సమంత ఓ షాకింగ్ న్యూస్ అయితే పంచుకుంది.

రీసెంట్ గా సమంత తనకి కండరాల సంబంధించి ఓ వ్యాధి రాగ దానికి ట్రీట్మెంట్ ని తీసుకుంటున్నట్టు కూడా తెలిపింది. అయితే ఈ పోస్ట్ తర్వాత నుంచి వచ్చిన వార్తలపై సమంత షాకింగ్ అంశాలు తాను ఎదుర్కొన్న చేదు అనుభవాలు లేటెస్ట్ గా సుమ తో ఇచ్చిన ఓ ఇంటర్వ్యూ లో ఆమె తెలిపింది.

నేను ఆ పోస్ట్ పెట్టాక అనేక వార్తలు నాపై వచ్చాయని అవన్నీ చూసి చాలా బాదపడినట్టుగా ఈ ఇంటర్వ్యూలో మరింత ఎమోషనల్ అయ్యి కన్నీళ్లు కూడా పెట్టేసుకుంది. నేనింకా చావలేదు బతికే ఉన్నానని కన్నీరు పెట్టుకుంది.

ఇలాంటి పరిస్థితులు చాలా బాధగా అనిపిస్తాయని సమంత అయితే తన ఉద్వేగాన్ని ఆపుకోలేకపోయింది. దీనితో సోషల్ మీడియాలో ఈ వీడియో వైరల్ గా మారింది. ఇక సామ్ నటించిన యశోద సినిమా అయితే ఈ నవంబర్ 11న రిలీజ్ కాబోతుంది.