చిరంజీవి ఇంట్లో మరో గొడవ

ఇప్పుడు టాలీవుడ్ లో దాదాపు పది మంది హీరోలు మెగా ఫామిలీ నుండే ఉన్నారు. ఎవరు అవునన్నా, కాదన్నా చిరంజీవి వల్లే వీళ్ళు హీరోలు అయ్యారన్నది మాత్రం నిజం. చిరంజీవి ఎవరు హెల్ప్ లేకుండా ఇంత స్థాయికి వస్తే..ఆయన పేరు చెప్పుకొని ఇండస్ట్రీలోకి వచ్చిన మెగా హీరోలు ..ఆయన పిల్లలు చిరంజీవి సంపాదించుకున్న పేరును చెడగొడుతున్నారు.

హీరో గా ఎంతో పేరు, ప్రఖ్యాతలు సంపాదించుకున్న చిరంజీవికి ప్రశాంతత లేదని తెలుస్తుంది. చిన్న కూతురు శ్రీజ ఇప్పటికే రెండు పెళ్లిళ్లు చేసుకుంది. రెండో పెళ్లి కూడా విడాకుల వైపు వెళ్తుందని సమాచారం. ఇంకో పక్క తన కూతురిలా పెంచిన నిహారిక కూడా ఏవేవో వివాదాల్లో వస్తుంది. అలాగే రామ్ చరణ్ కి పెళ్లి అయ్యి 10  ఏళ్ళు దాటుతున్నా ఇంకా సంతానం లేదు. ఇండైరెక్ట్ గా తమకు పిల్లలు కనే ఆలోచన లేదని ఉపాసన హింట్ ఇచ్చేసింది.

ఇప్పుడు సాయి ధరమ్ తేజ్ ఇంకో తలనొప్పి తెచ్చాడంట. సాయిధరమ్ తేజ్ హీరోయిన్ లారీసా ని ప్రేమిస్తున్నారని ..వీరిద్దరు లవ్ లో ఉన్నారని ..గత కొంతకాలంగా వార్తలు వినిపిస్తూనే ఉన్నాయి. సాయి ధరమ్ తేజ్ పుట్టినరోజు సందర్భంగా ఆమె పెట్టిన పోస్ట్ వైరల్ గా మారింది. ” హ్యాపీ బర్త డే నా తేజు “అంటూ “ఐ యామ్ ఇన్ లవ్ ” అంటూ పోస్ట్ చేసింది.

నిజానికి చిరంజీవికి  ఈ పెళ్లి ఇష్టం లేదట. ఆ అమ్మాయి తెలుగు అమ్మాయి కాదు ..మన ఇండియానే కాదు.. ఫారిన్ కంట్రీ.. అలాంటి అమ్మాయిని కోడలుగా వద్దు అని చెప్పి మెగాస్టార్ చిరంజీవి ముందు నుంచి చెప్తూనే ఉన్నారట. ఆయన కానీ సాయిధరమ్ తేజ్ మాత్రం ఆమెనే పెళ్లి చేసుకుంటానని పట్టుబడుతున్నాడంట