Upasana : పిల్లల గురించి మెగా కోడలు అడిగిన ప్రశ్నకు సద్గురు అద్భుతమైన సమాధానం…!

Upasana :మెగాస్టార్ చిరంజీవి కోడలు, అపోలో వైద్య సంస్థల వైస్ ప్రెసిడెంట్ గా ఉపాసన అందరికీ సుపరిచితమైన వ్యక్తి. ఇటీవల ఉపాసన సద్గురుని కలిసి పిల్లల గురించి ప్రశ్నలు అడిగారు. ఈ క్రమంలో పిల్లల్ని కనడం గురించి తనకి ఉన్న అనుమానాల గురించి ఉపాసన సద్గురుకి వెల్లడించింది. ఈ మేరకు ఈమె సద్గురుని రిలేషన్, రీ ప్రొడ్యూస్, రోల్ ఇన్ లైఫ్ గురించి అడుగుతూ.. ప్రజలే ఎక్కువగా వీటి గురించి నన్నే ఎందుకు అడుగుతున్నారు అంటూ ప్రశ్నించింది. నాకు పెళ్లి జరిగి పది సంవత్సరాలు అవుతోంది. నా వైవాహిక జీవితం ఎంతో ఆనందంగా ఉంది. ఐ లవ్ మై లైఫ్… అంటూ చెప్తూ పిల్లల విషయంలో నన్నే ఎందుకు ప్రశ్నలు వేస్తున్నారు అని సద్గురు ని అడిగింది.

ఈ క్రమంలో ఉపాసన అడిగిన ప్రశ్నలకు ఆమె సందేహాలకు సద్గురు స్పందిస్తూ..ఆసక్తికరమైన సమాధానం చెప్పారు. సద్గురు మాట్లాడుతూ.. ఒకవేల నువ్వు ఒక అడపులి అయితే పిల్లల్ని కను.ఎందుకంటే రోజు రోజుకి పులులు భూమ్మీద అంతరించిపోతున్నాయి. కానీ భూమి మీద మానవజాతి లెక్కకు మించి ఉంది. అందువల్ల ప్రపంచంలో పిల్లల్ని కనకుండా ఉండేవారికి నేను ఒక బహుమతి ఇస్తా.. ప్రస్తుతం ప్రపంచంలో పెరుగుతున్న జనాభాను బట్టి పిల్లల్ని కనవలసిన అవసరం లేదు. మన ఏకాగ్రత పనిమీద ఉంటే మన మనసులో పిల్లల్ని కనాలి అనే ఆలోచన రాదు. మనం చేసే పనిమీద మన మనసు, మెదడు ఏకాగ్రతతో ఉంటే ఎవరికీ ఇలాంటి ఆలోచనలు రావు .

ఇలా పని లేక ఖాళీగా ఉండే వారికి మాత్రమే శరీరంలో ఇటువంటి హార్మోన్లు ఎక్కువై పిల్లల్ని కనాలనే ఆలోచనా వస్తుంది. అందువల్ల ఈ రోజుల్లో పిల్లల్ని కనకుండా ఉండటమే మనం ప్రపంచానికి చేసే మేలు..అంటూ సద్గురు సమధానం ఇచ్చాడు. సద్గురు సమాధానం విన్న ఉపాసనమాట్లాడుతూ.. పిల్లల గురించి మెగా కోడలు అడిగితే మీరు ఇలా సమాధానం చెప్పేసారు కదా.. నేను వెళ్లిన వెంటనే మా అత్తగారి నుండి మా అమ్మగారి నుండి మీకు ఫోన్ లు వస్తాయి అని అనేసింది . అప్పుడు సద్గురు స్పందిస్తూ.. ఇలా అత్తలు, అమ్మల దగ్గర్నుంచి చాలా ఫోన్లే వచ్చాయని సద్గురు నవ్వేశాడు. ఈ విషయంలో సద్గురు చెప్పిన సమాధానం గురించి నెటిజన్స్ నెగటివ్ కామెంట్స్ చేస్తున్నారు.