స్కూల్‌పై రష్యా బాంబు దాడి.. పాఠశాలలో 400 మంది బాధితులు!

ఉక్రెయిన్‌పై పోల్​ నగరంలోని ఆర్ట్​ స్కూల్​పై రష్యా సైన్యం బాంబు దాడి చేసింది.  ఈ బడిలో దాదాపు 400 మంది శరణార్థులు ఆశ్రయం పొందుతున్నారు.  అయితే ఈ దాడి  సంబంధించిన వివరాలపై స్పష్టత  లేదు.రష్యా  జరిపిన ఈ బాంబు దాడిలో పాఠశాల పూర్తిగా ధ్వంసమైనట్లు ఉక్రెయిన్‌ అధికారులు తెలిపారు. శిథిలాల కింద కొందరు ప్రజలు ఉండొచ్చని చెప్పారు. మరోవైపు పౌరులు ఆశ్రయం పొందుతున్న ఓ థియేటర్​ పైన కూడా రష్యా బలగాలు మరియుపోల్‌లో బాంబు దాడి చేశాయి. ఈ ఘటనలో 130 మందిని రక్షించినట్లు అధికారులు తెలిపారు.