Crime: ప్రయాణికురాలితో అసభ్యంగా ప్రవర్తించిన ఆర్టీసీ డ్రైవర్.. చివరికి..?

Crime: తాజాగా ఒక మహిళ రాత్రి సమయంలో నెల్లూరు నుంచి విశాఖపట్నం వెళ్లడానికి ఇంద్ర ఏసీ బస్సులో అనకాపల్లి వరకు టికెట్ టికెట్ తీసుకుంది. అయితే బస్సులో మొత్తం ముగ్గురు ప్రయాణికులు ఉన్నారు. ఇక ఒంగోలు తర్వాత డ్యూటీ మారిన డ్రైవర్ తన పక్క సీట్ లో కూర్చుంటుండగా అప్పుడు ఆ మహిళ అన్ని సీట్లు ఖాళీగా ఉండగా ఇక్కడ ఎందుకు కూర్చుటుంన్నావ్ అని అడిగిందట. అప్పుడు అతను ఫోన్ ఛార్జింగ్ కోసం కూర్చున్నట్లు తెలిపారట. ఇక బస్సులో లైట్స్ ఆపేసిన తర్వాత తనతో ఆ బస్సు డ్రైవర్ అసభ్యంగా ప్రవర్తించాడు అని ఆమె తెలిపింది.

అయితే ఆమె సీటు వెనకాల కూర్చుని ఉన్న వృద్ధుడిని సహాయం కోరగా అతని పక్షవాతంతో బాధపడుతున్నానని సహాయం చేయలేదు అని చెప్పాడట. దీంతో సదరు మహిళ వెంటనే అనకాపల్లిలోని తన భర్తకు సమాచారం ఇచ్చినట్లు ఆమె వివరించింది. అనంతరం బస్సు విజయవాడ బస్ స్టేషన్ కు చేరుకున్న తర్వాత డ్రైవర్ పై ఆర్టీసీ అధికారులకు ఫిర్యాదు చేసినట్లు తెలిపింది. వెంటనే రంగంలోకి దిగిన అధికారులు అసభ్యంగా ప్రవర్తించిన డ్రైవర్ జనార్ధన్ ను వెంటనే విధుల నుంచి తప్పించారు.