ఘోర రోడ్డు ప్రమాదం.. ముగ్గురు మృతి

కృష్ణా జిల్లా జగ్గయ్యపేట మండలం గౌరవరం వద్ద రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో ముగ్గురు మృతిచెందగా.. మరో ముగ్గురికి తీవ్రగాయాలయ్యాయి. కారు కల్వర్టును ఢీకొనడంతో ఈ ఘటన జరిగింది. ప్రమాదం గురించి సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకొని క్షతగాత్రులను జగ్గయ్యపేట ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఈఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు ప్రమాద కారణాలపై ఆరా తీస్తున్నారు.