ఆంధ్రా- కర్ణాటక సరిహద్దు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం

ఆంధ్రా- కర్ణాటక సరిహద్దు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కర్ణాటకలోని పావగడ పలవలహళ్లి వద్ద ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఓ ప్రైవేట్‌ బస్సు బోల్తా పడడంతో నలుగురు మృతి చెందినట్లు తెలుస్తోంది. అయితే ప్రమాద తీవ్రతను చూస్తే మృతులు ఎక్కువగానే ఉండే అవకాశం కనిపిస్తోంది. వై.ఎన్‌.హొసకోట నుంచి పావగడకు బస్సు వెళ్తుండగా అదుపుతప్పి బోల్తా పడింది . ప్రమాద ఘటనను తెలుసుకున్న పోలీసులు అక్కడి చేరుకుని గాయపడిన వారిని స్థానిక ఆస్పత్రికి తరలించారు.