Rewanth Reddy: కాంగ్రెస్ పార్టీ శ్రేణులకు వార్నింగ్ ఇచ్చిన రేవంత్ రెడ్డి!

Rewanth Reddy: కాంగ్రెస్ పార్టీ చీఫ్ రేవంత్ రెడ్డి తాజాగా తన ట్విట్టర్ వేదికగా తమ పార్టీ శ్రేణులకు స్వీట్ వార్నింగ్ ఇచ్చాడు. ప్రస్తుతం తెలంగాణలో తమ పార్టీ మరింత బలోపేతం కావడానికి రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారు. అంతేకాకుండా వచ్చే నెలలో రాహుల్ గాంధీ ఒక సభ ఏర్పాటు కూడా చేశాడు.

వరుస సమావేశాలు ఉండటంతో ఐక్యంగా ముందుకు సాగాలని తన ట్విట్టర్ వేదికగా ట్వీట్ చేశాడు రేవంత్ రెడ్డి. కాంగ్రెస్ కు ఐకమత్యమే మహాబలం అంటూ.. అందుకు భిన్నంగా ఎవరైనా పార్టీ ముఖ్యుల పైన.. వివిధ హోదాలలో ఉన్న నాయకుల పైన, బహిరంగ లేఖ సోషల్ మీడియాలో విమర్శలు చేస్తే పార్టీ నుండి శాశ్వత బహిష్కరణ, క్రిమినల్ కేసులు ఎదుర్కోక తప్పదు అంటూ ట్వీట్ చేశాడు.