ఫ్యామిలీ పై ఈగ వాలిన కూడా ఊరుకునేది లేదు అంటున్న రేవంత్ రెడ్డి..

తెలంగాణ కాంగ్రెస్ పీసీసీ చీఫ్, ఎంపీ రేవంత్ రెడ్డి తాజాగా కొన్ని సంచలన వ్యాఖ్యలు చేశారు. నేషనల్ హెరాల్డ్ కేసులో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ తాజాగా ఈడీ విచారణలో పాల్గొన్న సంగతి తెలిసిందే. దీంతో కాంగ్రెస్ నేతలు ఆందోళన చెందుతూ బీజేపీ ప్రభుత్వం పై నిరసనకు దిగారు.

ఇక రేవంత్ రెడ్డి కూడా మాట్లాడుతూ.. గాంధీ కుటుంబం పై బీజేపీ అక్రమ కేసులు పెడుతోంది అని.. సోనియా కుటుంబంపై ఈగ వాలినా ఊరుకునేది లేదు అంటూ.. స్వతంత్ర పోరాటంలో నేషనల్ హెరాల్డ్ పత్రికది కీలక పాత్ర అని.. ఆ పత్రికలు బ్రిటిషర్లు నిషేధించారు అని.. కానీ దేశ సమగ్రత కోసం మళ్లీ పత్రికలన్నీ నడపాలి అని యాజమాన్యం నిర్ణయించారు అని అన్నారు. అంతే కాకుండా ఆ పత్రిక కష్టాల్లో ఉంటే కాంగ్రెస్ పార్టీ రూ.90 కోట్లు ఇచ్చింది అని.. ఇక బీజేపీ కుట్రలపై దేశవ్యాప్తంగా పోరాటం చేస్తాము అని అన్నారు.