Crime News: రిటైర్డ్ పైలెట్ దంపతుల హత్య.. వీరి హత్య వెనుక కారణం ఇదే!

Crime News: ప్రస్తుత కాలంలో ఈ రోజు రోజుకి హత్యలు పెరిగిపోతున్నాయి. భార్య భర్తల గొడవలు, పాత కక్షలు,దొంగతనానికి వచ్చి హత్యలు చేయటం ఇలా వివిధ రకాల కారణాల వల్ల దేశంలో రోజు రోజుకి హత్య కేసులు పెరిగిపోతున్నాయి. ఇటీవల బెంగళూరులోని పశ్చిమ శివారులోని ఈగిల్‌టన్‌ రిస్టార్ట్‌లో నివాసం ఉంటున్న భారత వైమానిక దళం రిటైర్డ్ ఎంప్లాయి అతని భార్య హత్య చేయబడ్డారు. పోలీసులు తెలిపిన సమాచారం ప్రకారం.. చెన్నైకి చెందిన రఘురాజన్‌ (70) భారత వైమానిక దళంలో పైలెట్ గా పని పని చేస్తూ రిటైర్డ్ అయ్యాడు. రఘు రాజన్ అతని భార్య ఆశ ఇద్దరు కలిసి ఈగిల్‌టన్‌ రిసార్ట్ లో విల్లాలో నివాసముంటున్నారు.

ఈ దంపతులకు ఇద్దరు కుమారులు. వీరు ఇద్దరు న్యూఢిల్లీలోని ఒక ప్రైవేటు సంస్థలో పని చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు. కుమారులు వారి తల్లిదండ్రులతో మాట్లాడాలని ఉద్దేశంతో వారికి ఫోన్ చేయగా తల్లిదండ్రులు ఎంతసేపటికీ లిఫ్ట్ చేయకపోవడంతో విల్లా సెక్యూరిటీ గార్డ్ కు సమాచారం అందించి ఇంటి లోపలికి వెళ్లి తనిఖీ చేయాలని కోరారు. సెక్యూరిటీ కార్డు వెళ్లి పరిశీలించగా దంపతులిద్దరూ విగత జీవులుగా రక్తపు మడుగులో పడి ఉండటం చూసి షాక్ అయ్యాడు. వెంటనే ఈ సమాచారాన్ని పోలీసులకు తెలియజేశాడు.

పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించి దుండుగులు తలపై సుత్తితో కొట్టి చంపారు అని పోలీసులు తెలిపారు. ఇంట్లో విలువైన వస్తువులను దొంగిలించదానికి ప్రయత్నం చేసిన దుండగులు ఈ దంపతులను హత్య చేసి ఉంటారని పోలీసులు  అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ప్రత్యేక పోలిసు బృందాలు రంగంలోకి దిగి నిధితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. దంపతుల మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.