Reddy Slams Raju : రఘురామపై సెటైర్లేసి అడ్డంగా బుక్కయిపోయిన విజయసాయిరెడ్డి!

Reddy Slams Raju : వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి పొలిటికల్ పంచ్‌లు వేయడంలో దిట్ట. అదే సమయంలో, ఆయన మీద పడే ట్వీట్లూ అంతే స్థాయిలో వైరల్ అవుతంటాయి. తిట్టడం, తిట్టించుకోవడం విజయసాయిరెడ్డికి అలవాటే.. అన్న భావన నెటిజన్లలో చాలామందిలో వుంది. అందుక్కారణం ఆయన వేసే ట్వీట్లు, వాటికి వచ్చే స్పందనలూ.!

తాజాగా, విజయసాయిరెడ్డి ఓ ట్వీటేశారు.. దానికి కౌంటర్ ఎటాక్ కూడా అంతే స్థాయిలో వచ్చింది. ఈసారి అధికార పార్టీకే చెందిన ఇద్దరు ఎంపీల మధ్య ఈ రచ్చ జరగడం గమనార్హం. అయితే, అందులో ఒకరు వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణరాజు. అద్గదీ అసలు సంగతి.

‘అవునా? నా జీవితం నీకు ఏ1కి భారంగా ఉందనే కదా నన్ను కూడా కడతేర్చాలనుకుంటున్నారు పాపం వివేకానందరెడ్డిలా! ప్రజల ఆస్తులు తాకట్టు పెట్టి సొమ్ములు దోచేస్తున్న మిమ్మల్ని రొచ్చులో తొక్కే రోజు దగ్గర పడింది మిస్టర్ ఏ2!’ అంటూ రఘురామ, విజయసాయిరెడ్డిపై మండిపడ్డారు.

ఇంతలా రఘురామ మండిపడటానికి కారణం, ‘జీవితాన్ని రొచ్చు చేసుకున్నావు కదా రాజా! ఏదో ప్రాపర్టీనో, వాహనాలనో అద్దెకు ఇచ్చినట్టు.. నిన్ను నువ్వే బాడుగకు ఇచ్చుకుని పెయిడ్ మైక్ అయ్యావు. లెక్క పంపిస్తే ట్వీట్లు, స్టేట్‌మెంట్లు ఏదైనా చేస్తావు. ఇంత నీచపు జీవితం భారంగా లేదూ? గెలిపించిన ప్రజలను తాకట్టు పెట్టేశావు కదా!’ అంటూ విజయసాయిరెడ్డి తొలుత వేసిన ట్వీటే.

ఈ ట్వీట్ల యుద్ధం విపక్షాలకు ఆయుధంగా మారింది. సాధారణ ప్రజానీకం సైతం అధికార పార్టీ తీరుపై విస్మయం వ్యక్తం చేస్తున్నారు. చంద్రబాబుపైనో, ఇంకొకరిపైనో ట్వీట్లేసినట్లు రఘురామపై ట్వీట్లేస్తే.. ఇదిగో ఇలాంటి పరిస్థితే వస్తుంది.

మరిప్పుడు రఘురామ ట్వీటుకి విజయసాయిరెడ్డి నుంచి కౌంటర్ ఎటాక్ వస్తుందా.? వేచి చూడాల్సిందే.