వరంగల్‌ జిల్లాలో భారీ అగ్ని ప్రమాదం.. రూ.40కోట్ల మేర ఆస్తి నష్టం!

delhi fire

వరంగల్‌ జిల్లా గీసుకొండ మండలం ధర్మారంలో ఉన్న టెస్కో గోదాంలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. 3 ఫైరింజన్ల సాయంతో మంటలు ఆర్పేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. సుమారు రూ.40కోట్ల మేర ఆస్తి నష్టం జరిగినట్లు తెలుస్తోంది. గోదాంలో పాఠశాల విద్యార్థులకు అందించాల్సిన చేనేత దుస్తులను నిల్వ ఉంచారు. కరోనా తీవ్రత వల్ల పాఠశాలలు తెరుచుకోకపోవడంతో నిల్వలు గోదాంలో పేరుకుపోయాయి. ఈ ప్రమాదంలో దుస్తులు పూర్తి స్థాయిలో దగ్ధమయ్యాయి