టాలీవుడ్ లో రష్మిక మందన్న జోరు తగ్గేలా లేదు! సినిమా సినిమాకు తన ట్రాక్ ను ఛేంజ్ చేసుకుంటూ కెరీర్ లో వచ్చినంత వేగంగా దూసుకెళుతోంది. అగ్ర హీరోలతో ఆడిపాడుతూనే కుర్ర హీరోలతో కూడా జోడీ కడుతోంది.
వచ్చిన అవకాశాన్ని అందిపుచ్చుకొని తన టాలెంట్ ని ఎప్పటికప్పుడు నిరూపించుకుంటూ తోటి నటీమణులకు సవాల్ విసురుతోంది. తాజాగా శర్వానంద్ తో జోడీ కట్టింది. తిరుమల కిషోర్ దర్శకత్వం వహిస్తున్న ‘ఆడవాళ్ళూ మీకు జోహార్లు’ చిత్రం ఇటీవలే తిరుపతిలో ప్రారంభమైంది. ఈ చిత్రం తర్వాత మరింత మంచి గుర్తింపు వస్తుందని రష్మిక చెబుతోంది.
ఇందులో ఓ చక్కటి వైవిధ్యమున్న పాత్ర చేస్తోందట. తనకు ఈ క్యారెక్టర్ ఎంతగానో నచ్చిందని అంటోంది. ఎంతో ఇష్టపడి ఒప్పుకున్నట్టు పేర్కొంది. ఏది ఎలా ఉండగా, కుర్ర హీరోలతో జోడీ కడితేనే చాలా సినిమాలు చేసినట్టవుతుందని భావించడమేగాక, దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకుని పనిలో పడిందని ఇండస్ట్రీ చెప్పుకుంటున్నారు. నిర్మాత సుధాకర్ చెరుకూరి ఈ చిత్రాన్ని ఎస్.ఎల్.వి.సి బ్యానర్ లో నిర్మిస్తున్నారు.