Rashmika Mandanna: రష్మిక మందన్న.. మానవత్వం ప్రదర్శించు … ఆగ్రహంతో విరుచుకుపడుతున్న నెటిజన్లు!

Rashmika Mandanna: నేషనల్ క్రష్‌గా విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్‌ను సంపాదించుకున్న బ్యూటీ రష్మిక మందన. ఇటీవల ఆమె నటించిన సినిమాలు బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్లుగా నిలుస్తుండడంతో ఆమె క్రేజ్ అమాంతం పెరిగిపోయింది. ఒక వేళ సినిమాలు ఆడకపోయినా కూడా రష్మికకు మాత్రం మంచి పేరే వస్తోంది. ఆమె నటనకు, లుక్స్‌కు జనాలు ఫిదా అవుతుండడం విశేషం. కొందరు వాటిని ఓవర్ యాక్షన్ అని కూడా నెగెటివ్‌గా ట్రోల్ చేసినా రష్మిక మాత్రం సినిమా సినిమాకూ ఎదుగుతూ దూసుకుపోతోంది..

పుష్ప సినిమాతో ఒక్కసారిగా నేషనల్ వైడ్‌గా హాట్ టాపిక్ మారిన రష్మిక, ఇప్పుడు బాలీవుడ్ చిత్రాలపై దృష్టి పెట్టినట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే ఆమె పలు హిందీ సినిమాల్లో నటిస్తున్నట్టు సమాచారం. తాజాగా రష్మిక నటిస్తున్న గుడ్‌బై సినిమా షూటింగ్‌ కోసం రిషికేష్‌కు వెళ్లేందుకు ముంబై ఎయిర్ పోర్టుకు చేరిన ఈ ముద్దుగుమ్మ, అక్కడ ఆమె చేసిన ఓ పనిపై అందరూ తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పిస్తున్నారు. ఎయిర్‌పోర్టుకు వచ్చిన రష్మిక, కారు డోరు తీసుకుంటూ కిందకు దిగింది. కానీ మళ్లీ కారు డోరు వేయలేదు. దాంతో ఆ పక్కనే ఉన్న ఓ వ్యక్తి వచ్చి కారు డోర్ వేయడంతో ఆమెకు పలువురు వ్యతిరేకంగా స్పందిస్తున్నారు. నీకు డోర్ తీసేంత సమయం కూడా లేదా, అంత పొగరు ఎందుకు , కాస్తంత మానవత్వం ప్రదర్శించు అంటూ తీవ్ర స్థాయిలో విరుచుకు పడుతున్నారు.

ఆ తరువాత మీడియా కోరిక మేరకు ఆమె త‌గ్గేదేలే.. అని డైలాగ్ చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోయింది. ఈ క్రమంలోనే ర‌ష్మిక మంద‌న్నకు చెందిన ఈ వీడియో సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది. ఇక ఈమె ప్రస్తుతం గుడ్‌బై అనే బాలీవుడ్ మూవీలో అమితాబ్ బ‌చ్చన్ కూడా నటిస్తున్నట్టు సమాచారం. ఇక త్వరలో పుష్ప 2 షూటింగ్‌లోనూ ఈమె పాల్గొన‌నున్న విషయం తెలిసిందే.