Crime News: రెండేళ్ల కుమారుడు ముందు తల్లి పై సామూహిక అత్యాచారం!

Crime News: సమాజంలో మహిళలకు, బాలికలకు, చిన్నారులకు రక్షణ లేకుండా పోతుంది. నిత్యం ఏదో ఒక చోట అఘాయిత్యాలు జరుగుతూనే ఉన్నాయి. ఇదిలా ఉంటే తాజాగా మరోచోట ఓ తల్లిపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు కొందరు దుండగులు. ఆంధ్రప్రదేశ్ పల్నాడు జిల్లా గురజాలలో నిన్న రాత్రి మరో గ్రామానికి వెళ్లేందుకు ఓ తల్లి కొడుకులు రైల్వే స్టేషన్ లో వేచి ఉన్నారు.

ఆ సమయంలో కొందరు దుండగులు ఆమెను ఎత్తుకెళ్లి అఘాయిత్యంకు పాల్పడ్డారు. ఇక ఈ రోజు ఉదయం స్థానికులు ఆమెను చూసి ఆస్పత్రికి తరలించారు. ఇక ఆ తల్లి పక్కనే ఉన్న తన రెండేళ్ల కుమారుడు ఏడుస్తూ కనిపించడంతో ఆ దృశ్యం అక్కడున్న వారిని కలిచివేసింది.