Crime News: సులభ్‌ కాంప్లెక్స్ లో 10 ఏళ్ల బాలిక మీద అత్యాచారం.. బాలిక ఏడుపు వినిపించటంతో..!

Crime News: రోజు రోజుకి మహిళల మీద అఘాయిత్యాలు పెరిగిపోతూనే ఉన్నాయి. చిన్నపిల్లలు ముసలివారు అని కూడా కనికరం లేకుండా కొంత మంది కామాంధులు వారి కోరికలు తీర్చుకోవడానికి దారుణాలకు పాల్పడుతున్నారు. ప్రభుత్వాలు ఇన్ ఎన్ని కఠిన చర్యలు అమలు చేసినా కూడా ఇటువంటి వారి ఆగడాలకు అడ్డుకట్ట వేయలేకపోతున్నారు. మహిళలు ఇంటి నుంచి బయటికి వెళ్ళారంటే వారు తిరిగి వచ్చే వరకు కుటుంబ సభ్యులు ఎంతో ఆందోళన చెందాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. ఈ మధ్యకాలంలో చిన్న పిల్లల మీద కూడా అత్యాచారాలు చేసే వారి సంఖ్య రోజురోజుకు పెరుగుతూనే ఉంది. ఇటీవల రంగారెడ్డి జిల్లాలో కూడా ఇటువంటి దారుణమైన సంఘటన చోటు చేసుకుంది.

వివరాల్లోకి వెళితే… రంగారెడ్డి జిల్లాలో,బడంగ్పేట్‌లో స్థానికంగా ఉండే మహిళ పండ్ల వ్యాపారం చేస్తూ జీవనం సాగిస్తోంది. ఈ క్రమంలో తాజాగా మహిళ 10 సంవత్సరాల వయసున్న కూతురు మూత్ర విసర్జన కోసం దగ్గరలోని సులబ్ కాంప్లెక్స్ కి వెళ్ళింది. అక్కడ పనిచేసే రవీందర్ అనే వ్యక్తి అమ్మాయి రావటం గమనించాడు.

బాలికను సులబ్ కాంప్లెక్స్ లోపలికి తీసుకువెళ్ళి , ఆమెకు సెక్స్ వీడియో లు చూపిస్తూ చిన్నారి మీద అత్యాచారానికి పాల్పడ్డాడు. కూతురు ఎంతసేపటికీ కనిపించకపోవడంతో చిన్నారి తల్లి ఆందోళన చెంది చిన్నారి కోసం వెతుకుతూ అనుమానం వచ్చి కాంప్లెక్స్ లోపలికి వెళ్ళింది. అక్కడ చిన్నారి ఏడుపు వినిపించటం తో డోర్ తీయగా రవీందర్ అక్కడినుండి పారిపోవడానికి ప్రయత్నం చేశాడు. వెంటనే అక్కడే ఉన్న స్థానికులు నిందితుడిని పట్టుకొని చితకబాదారు. తర్వాత మీర్ పేట్ పోలీసులకి ఫిర్యాదు చేసి నిందితుడిని పోలీసులకు అప్పగించారు.