తమిళ సినిమాకి తెలుగు సీక్వెల్

Ramesh Varma pens sequel for Rakshasudu
Ramesh Varma pens sequel for Rakshasudu
తెలుగు నిర్మాతలు, హీరోలు ఈమధ్య రీమేక్ సినిమాల మీద ఎక్కువగా ఆసక్తి చూపుతున్నారు. చిన్న, పెద్ద అనే తేడా లేకుండా అందరు హీరోలు తమిళ, మలయాళంలో హిట్ అయిన సినిమాల హక్కులను కొనేసి రీమేక్ చేస్తున్నారు. అలా తెలుగులోకి రీమేక్ అయిన సినిమానే రాక్షసుడు.  ఈ తమిళ సినిమా రీమేక్ దర్శకుడు రమేష్ వర్మ. బెల్లంకొండ శ్రీనివాస్ హీరో.  చిత్రం మంచి విజయాన్ని అందుకుంది.  దీంతో దీనికి సీక్వెల్ కథను సిద్ధం చేశాడు రమేష్ వర్మ.  తమిళంలో రాక్షసన్ చిత్రానికి సీక్వెల్ లేదు.  కానీ తెలుగులో రాక్షసుడు-2 కథ సిద్దమైంది. 
 
ఈ కథను కూడ బెల్లంకొండతోనే చేయాలని రమేష్ వర్మ భావించారు. కానీ బెల్లంకొండ బాలీవుడ్ చిత్రాలతో బిజీగా ఉన్నాడు.  అక్కడ రెండు సినిమాలు చేస్తున్నాడు.  అందుకే ఈ సీక్వెల్ మీద ఆసక్తిగా లేడు. దీంతో రమేష్ వర్మ కొత్త హీరోను వెతుక్కునే పనిలో పడ్డాడు. ఇప్పుడిప్పుడే హీరోగా నిలదొక్కుకుంటున్న నటుడితో ప్లాన్ చేస్తున్నారట.  మరి ఆ హీరో ఎవరో తెలియాలంటే ఇంకొన్నాళ్లు ఆగాల్సిందే.  ఇక రమేష్ వర్మ రవితేజతో ఖిలాడి చేస్తున్నారు.  ఇంకొద్దిరోజుల షూటింగ్ జరిగితే అది కాస్త పూర్తవుతుంది.