ముఖ్యమంత్రి జగన్ పై విమర్శలు చేసిన రామకృష్ణ..

సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ తాజాగా ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పై విమర్శలు చేశాడు. అమ్మఒడి పథకం విషయంలో జగన్ మాట తప్పాడని.. మడమ తిప్పారని ఫైర్ అయ్యాడు. 2021- 22 ఆర్థిక సంవత్సరంలో అసలు అమ్మ ఒడిని అమలు చేయలేదని అన్నాడు.

ఇక ఈ ఏడాది విడుదల చేసే అమ్మ ఒడికి రూ.13 వేలు మాత్రమే జమ చేయనున్నారని.. ఇది చాలా దారుణం అని అన్నాడు. దీని విషయంలో ప్రభుత్వం ఎన్నో మెలికలు పెడుతుందని.. కాబట్టి జగన్ ఎటువంటి కోతలు విధించకుండా రూ.15వేలు వేయాలి అని డిమాండ్ చేశాడు. అంతేకాకుండా పాఠశాల మరుగుదొడ్ల నిర్వహణ కూడా రూ.1000 కోత విధించారని.. మౌలిక సదుపాయాల నిర్వహణకు రూ.1000 తగ్గించబోతున్నాడు అని అన్నాడు.