సౌత్ స్టార్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ హవా ఈమధ్యబాగా తగ్గింది. చేసిన కొన్ని చిత్రాలు అపజయాల పాలవడంతో కెరీర్ స్లో డౌన్ అయింది. అలాగే బాలీవుడ్ మీద ఎక్కువ దృష్టి పెట్టడంతో తెలుగులో కూడా పెద్దగా సినిమాలకు సైన్ చేయలేదు.

ప్రస్తుతం తెలుగులో క్రిష్ దర్శకత్వంలో పంజా వైష్ణవ్ తేజ్ హీరోగా చేస్తున్న సినిమాలో కథానాయకిగా నటిస్తోంది రకుల్. అలాగే నితిన్, చంద్రశేఖర్ ఏలేటిల ‘చెక్’ చిత్రంలో నటిస్తోంది. అలాగే శంకర్ ‘ఇండియన్ 2’లో ఇక కీలక పాత్ర చేస్తోంది.
బాలీవుడ్ లో తాజాగా ‘మే డే’ సినిమాకు సైన్ చేసింది. ఈ సినిమాలో అజయ్ దేవగన్ హీరోగా నటిస్తూనే దర్శకత్వం వహించనున్నారు. ఇందులో రకుల్ ప్రీత్ సింగ్ పైలెట్ పాత్రలో నటించనుంది. అజయ్ దేవగన్ సరసన ఆమె నటించడం ఇది రెండోసారి. గతంలో వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చిన ‘దే దే ప్యార్ దే’ సినిమా మంచి విజయాన్ని అందుకుంది.
ఇకపోతే ఈ సినిమాలో అమితాబ్ బచ్చన్ ఒక కీ రోల్ పోషించనున్నారు. ఆయనతో నటించడం రకుల్ కు ఇదే మొదటిసారి. అందుకే సినిమా పట్ల ఎక్కువ ఎగ్జైట్ అవుతోంది రకుల్. ఈ సినిమాకు నిర్మాత కూడా అజయ్ దేవగనే. డిసెంబర్ నుండి హైదరాబాద్ లోని రామోజీ ఫిలిం సిటీలో షూటింగ్ ప్రారంభం కానుంది.ఇందులో డిసెంబర్ మధ్య నుండి రకుల్ షూటింగ్ లో పాల్గొననుంది.
