ర‌కుల్ ప్రీత్ సింగ్‌కు క‌రోనా పాజిటివ్.. స్వీయ నిర్భందం

ప్ర‌పంచాన్ని గ‌జ‌గ‌జ వ‌ణికించిన క‌రోనా మ‌హ‌మ్మారి ఓ ద‌శ పూర్తి చేసింది. ఇప్పుడు రూపాంత‌రం చెందిన ఈ మ‌హ‌మ్మారి స్ట్రెయిన్ అంటూ అంద‌రిలో వ‌ణుకు పుట్టిస్తుంది. మొన్న‌టి వ‌ర‌కు కాస్త సాదాసీదా జీవితం గ‌డిపిన వారంద‌రు బ్రిట‌న్‌లో క‌రోనా రూపాంత‌రం చెందిందని తెలిసి భ‌య‌ప‌డుతూ కాలం గ‌డుపుతున్నారు. ఇలాంటి స‌మ‌యంలో టాప్ హీరోయిన్ ర‌కుల్ ప్రీత్ సింగ్ క‌రోనా బారిన ప‌డింది. ఈ విషయాన్ని ర‌కుల్ త‌న సోష‌ల్ మీడియా ద్వారా స్వ‌యంగా తెలియ‌జేసింది. కొన్ని రోజుల క్రితం త‌న ఫ్యామిలీతో మాల్దీవులకి వెళ్లి వ‌చ్చిన ఈ అమ్మ‌డు ప్ర‌స్తుతం షూటింగ్స్‌తో బిజీగా ఉంది. ఈ క్ర‌మంలొఓ తాను క‌రోనా బారిన ప‌డ‌డం ఆందోళ‌న క‌లిగిస్తుంది.

ర‌కుల్ త‌న పోస్ట్‌లో. నాకు క‌రోనా పాజిటివ్ అని నిర్ధార‌ణ అయింది. స్వీయ నిర్భందంలోకి వెళ్ళాను. ఇప్ప‌టి వ‌రకు నా ఆరోగ్యం బాగానే ఉంది. ఈ మ‌ధ్య కాలంలో న‌న్ను క‌లిసిన వారంద‌రు క‌రోనా టెస్ట్‌లు చేయించుకోగ‌ల‌రు. త్వ‌ర‌లోనే మ‌రింత ఉత్సాహంతో తిరిగి షూటింగ్‌లో పాల్గొంటాను అని ర‌కుల్ పేర్కొంది.ర‌కుల్ క‌రోనా అని తెలిసి ప‌లువురు సెల‌బ్రిటీలు, అభిమానులు ఆమెకు గెట్ వెల్ సూన్ అంటూ కామెంట్స్ పెడుతున్నారు. కాగా, ఇటీవల మిల్కీ బ్యూటీ తమన్నా కూడా కరోనా బారినపడి కోలుకున్న సంగతి తెలిసిందే. ప్ర‌స్తుతం ఆమె చాలా ఉత్సాహంగా క‌నిపిస్తుంది.

ర‌కుల్ కెరీర్ విష‌యినికి వ‌స్తే ‌ ప్రస్తుతం క్రిష్ దర్శకత్వంలో వైష్ణవ్ తేజ్ హీరోగా రూపొందుతున్న సినిమాలో నటిస్తోంది.ఈ చిత్ర షూటింగ్ కొద్ది రోజుల క్రితం పూర్తైంది. అమితాబ్‌బచ్చన్‌, అజయ్‌ దేవగణ్‌ ప్రధాన పాత్రల్ల రూపొందుతున్న‌ హిందీ చిత్రం ‘మేడే’. స్వీయ నిర్మాణ దర్శకత్వంలో అజయ్‌దేవగణ్‌ రూపొందిస్తున్నారు.ఇందులోను రకుల్‌ప్రీత్‌సింగ్ క‌థానాయిక‌గా న‌టిస్తుంది. నితిన్ స‌ర‌స‌న చెక్ మూవీ, అర్జున్ కపూర్ హీరోగా తెరకెక్కుతున్న చిత్రంలో ర‌కుల్ న‌టిస్తుండ‌గా ఇవి ఓటీటీలో విడుద‌ల అయ్యేందుకు సిద్దంగా ఉన్నాయ‌ని టాక్