Rajasree: రాజేంద్రప్రసాద్‌ గారు సెట్లో అందరికీ భోజనం తెప్పించేవారు.. రాజశ్రీ నాయర్!

Rajasree: రాజేంద్రప్రసాద్‌ గారితో కలిసి మూడు సినిమాలు చేశానని ప్రముఖ నటి రాజశ్రీ నాయర్ అన్నారు. ఆయన దగ్గర్నుంచి నేర్చుకోవాల్సింది చాలా ఉందని ఆమె చెప్పుకొచ్చారు. తన మొదటి సినిమా సోలో బతుకే సో బెటర్ అన్న రాజశ్రీ, వరుసగా 4,5 రోజులు పనిచేయాల్సి వచ్చేదని ఆమె చెప్పారు.

రాజేంద్రప్రసాద్‌ గారితో కలిసి కోతి కొమ్మచ్చి సినిమాలో నటించానన్న రాజశ్రీ నాయర్, ఆయన చాలా స్పోర్టివ్ అని కాంప్లిమెంట్ ఇచ్చారు. ఆ సినిమా ప్రొడక్షన్‌ వల్ల రిలీజ్ కావడానికి టైం పడుతుందని ఆమె అన్నారు. కానీ ఆ చిత్రంలో చాలా మంచి మంచి సీన్లున్నాయని ఆమె వివరణ ఇచ్చారు. అదే టైంలో తన నటనను చూసి అభినందించేవారని ఆమె చెప్పుకొచ్చారు. అది తనకు చాలా పెద్ద విషయమని, ఎందుకంటే ఆయన చాలా సీనియర్ మరియు ఆయన కామిక్ టైంతో మ్యాచ్ అవడం చెప్పుకోదగిన విషయమని ఆమె అన్నారు.

ఇకపోతే రాజేంద్రప్రసాద్‌కి కోపం ఎక్కువని అందరూ అంటారు గానీ, తాను మాత్రం ఆ సిచ్యువేషన్‌ను ఎప్పుడూ ఫేస్ చేయలేదని ఆమె చెప్పారు. ఆయన తననెప్పుడూ కోపగించుకోలేదని ఆమె మరోసారి స్పష్టం చేశారు. సెట్లోకి ఆయన ఎప్పుడు వచ్చినా కూడా అందరికీ సరిపోయేలా భోజనం తీసుకువస్తారని రాజశ్రీ నాయర్ అన్నారు. ప్రతీ ఒక్కరికీ తాను తెచ్చింది ఇస్తారని ఆమె చెప్పారు. దాంతోపాటు ఆయన మహిళలంటే కూడా చాలా గౌరవం ఇస్తారని ఆమె తెలిపారు. తనకు తెలిసినంత వరకు అలాంటి వారితో స్క్రీన్‌ స్పేస్ దొరకడమే చాలా అదృష్టంగా భావిస్తానని ఆమె స్పష్టం చేశారు.