టాలీవుడ్ ఇండస్ట్రీలో ఉన్న టాప్ డైరెక్టర్లలో రాజమౌళి కూడా ఒకరు. ఈయన దర్శకత్వం వహించిన ప్రతి సినిమా కూడా సూపర్ హిట్ అవ్వాల్సిందే. స్టూడెంట్ నంబర్ 1 నుండి ఆర్ఆర్ఆర్ వరకు ఈయన దర్శకత్వం వహించిన అన్ని సినిమాలు మంచి విజయం సాధించాయి. ఆర్ఆర్ఆర్ సినిమా తర్వాత రాజమౌళి మహేష్ బాబు కాంబినేషన్ లో ఒక సినిమా తెరకెక్కనుంది. ఇదిలా ఉండగా బాలీవుడ్ స్టార్ హీరో రణబీర్ ఆలియా భట్ హీరో హీరోయిన్లుగా తెరకెక్కుతున్న పాన్ ఇండియా సినిమా ” బ్రహ్మాస్త్ర ” . ఈ సినిమాను తెలుగులో బ్రహ్మాస్త్రం అనే టైటిల్ తో రిలీజ్ చేయనున్నారు.
ఈ సినిమాలో రణబీర్ కపూర్, అలియా భట్, అమితాబచ్చన్, మౌని రాయ్ వంటి వారు కీలక పాత్రలో నటించనున్నారు. టాలీవుడ్ స్టార్ హీరో నాగార్జున కూడా ఒక కీలక పాత్రలో నటించనునన్నారు. బిగ్ బాస్ సీజన్ 5 తెలుగు కి గెస్ట్ గా వచ్చిన రాజమౌళి , రణబీర్ , ఆలియా భట్ బ్రహ్మాస్త్ర సినిమా గురించి తెలియచేశారు. తాజాగా ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా వైజాగ్ లో ఒక ఈవెంట్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి రాజమౌళి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా రాజమౌళి మాట్లాడుతూ 4 సంవత్సరాల క్రితం కరణ్జోహార్ తనకి ఫోన్ చేసి ఒక పెద్ద సినిమా చేయబోతున్నాను. మీకు కథ నచ్చితే సౌత్ ఇండియాలో ఈ సినిమాకి సమర్పకుడిగా మిమ్మల్ని అనుకుంటున్నాను అని చెప్పారు.
కొంతకాలం తర్వాత బ్రహ్మాస్త్ర సినిమాకు దర్శకత్వం వహిస్తున్న అయాన్ ని కలిసి సినిమా కథ విన్నాను.
అయాన్ కథ చెప్పే విధానం చూసి నేను చాలా ఇంప్రెస్స్ అయ్యాను. ఆ తరువాత తను తన తయారు చేసిన సినిమా విజువల్స్ 20 నిమిషాల పాటు చూసాను. ఆ విజువల్స్ చూసిన తర్వాత సినిమా ఇండస్ట్రీకి మరొక పిచ్చోడు దొరికాడు అనుకున్నాను. ఈ సినిమా చూసిన నాన్నగారు కూడా ఒక బ్లాక్ బస్టర్ సినిమా తీసి తన దగ్గర పెట్టుకున్నాడని నాతో అన్నాడు. నాన్న గారికి కూడా ఆ సినిమా అంతా బాగా నచ్చింది. మీకు కూడా ఈ సినిమా తప్పకుండా నచ్చుతుంది…అంటూ చెప్పుకొచ్చాడు.
