Rajamouli : ప్రపంచ వ్యాప్తంగానే కాకుండా మన దేశంలో కూడా సినిమాలు అన్నా క్రీడల్లో అయితే క్రికెట్ అన్నా అభిమానులు కోట్లల్లో ఉన్నారు. ఈ రెండు కూడా ఒక ఎమోషన్స్ లో ఇండియన్స్ నరనరాల్లో ఇంకిపోయాయి. అంతే ఊపులో మన వారు రెండిటినీ కూడా ఆదరిస్తారు.
అయితే సినిమాల్లో భారీ బడ్జెట్ తో కూడుకున్నవి స్టార్ దర్శకులు పాన్ ఇండియా సినిమాలు వచ్చిన ఆ హంగామా ఎలా ఉంటుందో అలాగే మనదేశంలో పొట్టి క్రికెట్ ఫార్మాట్ అదే టి 20 లు ముఖ్యంగా ఐపీఎల్ సీజన్ వచ్చినప్పుడు అంతే కేజ్రీగా ఉంటుంది. అయితే ఈ రెండు ఒకేసారి వచ్చినపుడు మాత్రం మళ్ళీ డామినేషన్ సినిమాదే అని ప్రూవ్ అయ్యింది.
లేటెస్ట్ గా భారీ అంచనాలతో వచ్చిన సినిమా ట్రిపుల్ ఆర్(RRR) రిలీజ్ మ్యానియా లో అసలు ఐపీఎల్ తేదీని కూడా చాలా మంది మర్చిపోయారు. నిజానికి నిన్ననే ఫస్ట్ మ్యాచ్ అయినా కూడా రాజమౌళి దెబ్బకి ఇండియా మొత్తంలో తన సినిమానే మెయిన్ హాట్ టాపిక్ గా మారి సంచలనం అయ్యిపోయింది.
అయితే సేమ్ ఇలాగే గతంలో కూడా బాహుబలి 2 టైం లో జరిగింది. మళ్ళీ ఇప్పుడు జరిగింది. ఇక్కడ ఆసక్తిగా రెండు సినిమాలు కూడా రాజమౌళివే కావడం విశేషం. మొత్తానికి అయితే ఇలా రెండు సార్లు ఐపీఎల్ మన సినిమాల దగ్గర నిలబడలేకపోయింది. మెగాపవర్ స్టార్ రామ్ చరణ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ లు హీరోలుగా నటించిన ఈ భారీ సినిమా రికార్డు స్థాయి వసూళ్లతో ఇప్పుడు దూసుకెళ్తుంది.