‘రాజ రాజ చోర’ అంటూ చోరుడి పాత్రలో యంగ్ హీరో శ్రీ విష్ణు ఇటీవలే ప్రేక్షకుల ముందుకొచ్చిన సంగతి తెలిసిందే. ధియేటర్లో రిలీజైనా, ఈ సినిమాకి ఓటీటీలో మంచి ఆదరణ దక్కింది. చోరుడిగా శ్రీ విష్ణు పండించిన కామెడీ సింప్లీ సూపర్బ్ అనేలా ప్రేక్షకులకు డిఫరెంట్ కిక్ ఇచ్చింది.
సినిమా సినిమాకీ తనని తాను మార్చుకుంటూ,డిఫరెంట్ కాన్సెప్టులతో తనదైన హీరోయిజం పండించే శ్రీ విష్ణు, ఇప్పుడు ‘అర్జున ఫల్గుణా..’ అంటూ మరో కొత్త కాన్సెప్ట్తో వచ్చేస్తున్నాడు. లేటెస్టుగా ఈ సినిమా టీజర్ రిలీజ్ చేశారు.
‘నాది కాని కురుక్షేత్రంలో నాకు తెలియకుండానే పద్మవ్యూహంలో ఇరుక్కుపోయాను.. కానీ, నేను అభిమన్యున్ని కాను అర్జునున్ని..’ అంటూ శ్రీ విష్ణు చెప్పే డైలాగ్ ఆకట్టుకుంటోంది. టీజర్ ఆశాంతం యాక్షన్ మోడ్లో సాగింది. అమృతా అయ్యర్ హీరోయిన్గా నటిస్తున్న ఈ సినిమాకి తేజ్ మార్ని దర్శకత్వం వహిస్తున్నాడు. మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్లో రూపొందుతోంది.