రాధేశ్యామ్ స‌ర్‌ప్రైజింగ్ గిఫ్ట్ టైం కూడా ఫిక్స్ అయింది..ఇక రచ్చ ర‌చ్చే..!

బాహుబ‌లి త‌ర్వాత ప్ర‌భాస్ న‌టించిన చిత్రం సాహో. ఈ మూవీ తెలుగు ప్రేక్ష‌కుల‌ను పెద్ద‌గా అల‌రించ‌క‌పోవ‌డంతో రాధేశ్యామ్ సినిమాపై భారీ అంచ‌నాలు నెల‌కొన్నాయి. ఈ సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుందా అని ఫ్యాన్స్ ఎంతో ఆస‌క్తిగా ఎదురు చూస్తున్నారు. అయితే ఫిబ్ర‌వ‌రి 14న ల‌వ‌ర్స్ డే స్పెష‌ల్‌గా సినిమా నుండి గ్లింప్స్ వీడియో ఒక‌టి విడుద‌ల చేయ‌నున్న‌ట్టు స‌మాచారం. తాజాగా ఈ గ్లింప్స్ వీడియోకు సంబంధించి మ‌రో అప్‌డేట్ సోష‌ల్ మీడియాలో చ‌క్క‌ర్లు కొడుతుంది.

ఫిబ్ర‌వ‌రి 14న విడుద‌ల కానున్న గ్లింప్స్ డ్యూరేష‌న్ లాక్ చేయ‌గా, ఈ అద్భుత‌మైన విజువ‌ల్ ఒక నిమిషం ప‌దిహేను సెకండ్స్ ఉంటుంద‌ని స‌మాచారం. ఈ వీడియోతో సినిమాపై భారీ అంచ‌నాలు పెర‌గ‌డం ఖాయం అని అంటున్నారు . జిల్ ఫేం రాధాకృష్ణ కుమార్ ఈ చిత్రాన్ని తెర‌కెక్కించ‌గా, ఇందులో ప్ర‌భాస్ విక్ర‌మాదిత్య పాత్ర‌లో క‌నిపించ‌నున్నాడు. పూజా హెగ్డే ప్రేర‌ణ‌గా అల‌రించ‌నుంది. పూర్వ జ‌న్మ‌ల నేప‌థ్యంలో రాధేశ్యామ్ చిత్రం తెర‌కెక్క‌నుంది.

పీరియాడికల్‌ లవ్‌ స్టోరీగా యు.వి.కృష్ణంరాజు సమర్పణలో రూపొందిన రాధేశ్యామ్ సినిమాను యూవీ క్రియేషన్స్‌ బ్యానర్‌పై వంశీ కృష్ణారెడ్డి, ప్రమోద్‌ ఉప్పలపాటి నిర్మిస్తున్నారు. చిత్రంలో భాగ్య శ్రీ, సచిన్ కేడ్కర్, ప్రియదర్శి, సాషా ఛత్రీ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. పాన్ ఇండియా సినిమాగా తెలుగు, తమిళ, మలయాళీ, హిందీ, కన్నడ భాషల్లో ఈ మూవీ రిలీజ్ కానుంది. చిత్రానికి సంబంధించి విడుద‌లైన ప్ర‌చార చిత్రాలు మూవీపై భారీ అంచ‌నాలు పెంచాయి. సినిమా కోసం జాతీయ స్థాయిలో చ‌ర్చ న‌డుస్తుంది. ఇట‌లీలో ఎక్కువ భాగం చిత్రీక‌ర‌ణ జ‌ర‌ప‌గా, క‌రోనా విజృంభిస్తున్న స‌మ‌యంలోను అక్క‌డికి వెళ్లి మిగ‌తా పార్ట్ పూర్తి చేసి వచ్చారు. ఇదిలా ఉంటే ప్ర‌భాస్ ప్ర‌స్తుతం ఆదిపురుష్‌, స‌లార్, నాగ్ అశ్విన్ ద‌ర్శ‌కత్వంలో రూపొంద‌నున్న చిత్రాల‌తో బిజీగా ఉన్నాడు. ఇందులో స‌లార్, ఆదిపురుష్ చిత్రాలు సెట్స్ పైకి వెళ్ళాయి.