Radhe Shyam : ‘రాధేశ్యామ్’ నష్టమెంత.? ప్రబాస్ ఏం చేయబోతున్నాడు.?

Radhe Shyam : దాపరికం ఏమీ లేదు. ‘రాధేశ్యామ్’ సినిమాకి నష్టాలు తప్పవు. ఓ మోస్తరు నష్టాలు కాదు. భారీ నష్టాలే ఎదురవుతాయని ట్రేడ్ పండితులు తొలి రోజే తేల్చారు. దాదాపు 350 కోట్లు ‘రాధేశ్యామ్’ సినిమా కోసం ఖర్చయ్యిందని స్వయంగా ప్రబాస్ చెప్పాడు.\

మరి, వసూళ్లు అందులో సగమైనా వస్తాయా.? రావా.? సినీ వర్గాల్లో ఈ విషయమై ఆసక్తికరమైన రీతిలో చర్చ జరుగుతోంది. రకరకాల ఊహాగానాలు వినిపిస్తున్నాయ్. నష్టం భారీగానే వుండబోతోందనే అభిప్రాయం సర్వత్రా బలంగా వినిపిస్తోంది.

ఈ విషయమై ప్రబాస్, అలాగే నిర్మాతల మధ్య చర్చ కూడా జరిగిందట. ఏం చేద్దాం.? అనే విషయమై సుదీర్ఘ మంతనాలు చోటు చేసుకుంటున్నట్లు తెలుస్తోంది. అయితే, బయట ప్రచారం జరుగుతున్నట్లుగా నష్టాలు మరీ ఎక్కువగా వుండబోవని ఓ నిర్ణయానికి హీరో, నిర్మాతలు వచ్చారనీ అంటున్నారు.

ఏమో, సినిమా వ్యాపారం అంటే ఓ మ్యాజిక్ బోలెడంత గందరగోళం. చాలా చాలా సస్పెన్స్. ‘సాహో’ సినిమా టైమ్‌లో కూడా ఇలాంటి ప్రచారాలు జరిగాయ్. అప్పుడూ ప్రబాస్ ఆ చిత్ర నిర్మాతల్ని ఆదుకున్నాడనీ అంటారు. ఇప్పుడూ అవసరమైతే ప్రబాస్ అలా ఆదుకోవడానికి ముందే నిలబడతాడు.

‘జిల్’ ఫేమ్ రాధాక్రిష్ట కుమార్ దర్శకత్వంలో రూపొందిన ‘రాధేశ్యామ్’ సినిమాలో ప్రబాస్ సరసన హీరోయిన్‌గా పూజా హెగ్దే నటించిన సంగతి తెలిసిందే