‘రాధే శ్యామ్’ బ్యానర్ పరువు ఇండియా లెవెల్లో తీస్తున్నారు.!

పాన్ ఇండియన్ స్టార్ ప్రభాస్ కి బాహుబలి సిరీస్ తో ఎంత ఫేమ్ వచ్చిందో మన అందరికి తెలుసు. దీని తర్వాత ప్రభాస్ తన ఫ్యామిలి ఫ్రెండ్స్ బ్యానర్ యూవీ క్రియేషన్స్ లో సినిమాలు వెంటనే ఒకదాని తర్వాత ఒకటి అనౌన్స్ చేసేసాడు. మరి ప్రభాస్ ఏ ముహూర్తాన యూవీ వారితో సినిమాలు ఓకే చేసాడో కానీ అక్కడ నుంచి ప్రభాస్ ఫ్యాన్స్ కి కష్టాలు తప్పలేదు. అప్పుడు సాహో నుంచి ఇపుడు రాధే శ్యామ్ వరకు ఒక్క అప్డేట్ ని కూడా సరైన సమయానికి ఇచ్చింది లేదు.

అసలు ఇచ్చినవి కూడా తక్కువే దీనితో ప్రభాస్ అభిమానులు చాలా ఫ్రస్ట్రేషన్ లోకి వెళ్లిపోయారు. ఇక నిన్న ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న రాధే శ్యామ్ సాంగ్ విషయంలో చేసిన లేట్ కి వారి ఓపిక అంతా నశించిపోయి ఈ బ్యానర్ పై నెగిటివ్ ట్రెండ్ చెయ్యడం స్టార్ట్ చేశారు. ఇది కాస్తా ఇప్పుడు ఇండియన్ లెవెల్లో ట్రెండ్ అవుతుంది. వరస్ట్ బ్యానర్ యూవీ క్రియేషన్స్ అంటూ నేషనల్ లెవెల్లో వారి పరువు తీసేసారు. వారి సహనం అంతా అలా నశించిపోయింది మరి.