Raashi Khanna : సోషల్ ట్రోలింగ్: ‘తగ్గేదే లే’ అంటోన్నరాశి ఖన్నా

Raashi Khanna : ‘జోరు’ సినిమాతో ప్రేక్షకుల్ని పలకరించి, ‘ఊహలు గుసగుసలాడే’ సినిమాతో కుర్రకారు గుండెల్లో ప్రత్యేకమైన స్థానం సంపాదించుకున్న ముద్దుగుమ్మ రాశీఖన్నా. కేవలం గ్లామర్ పాత్రలే కాదు, నటిగా గుర్తింపు తెచ్చుకునే పాత్రల్లోనూ కనిపించి మెప్పించగలదు రాశీఖన్నా.
కానీ, ఇంతవరకూ కేవలం గ్లామరస్ పాత్రలతోనే సరిపెట్టుకోవల్సి వచ్చింది రాశీఖన్నా. అయితే, లేటెస్టుగా ఓటీటీ వేదికపై రాశీఖన్నాలోని నటికి ఛాలెంజ్ విసిరే పాత్రల్లో ఆఫర్లు వస్తున్నాయట. ఆ కోవలోనే ‘రుద్ర’ అనే ఓ హిందీ వెబ్ సిరీస్‌లో రాశీఖన్నాఇటీవల నటించింది.
అజయ్ దేవగణ్ ప్రధాన పాత్రలో రూపొందిన ఈ వెబ్‌సిరీస్‌లో రాశీఖన్నా ఓ డిఫరెంట్ పాత్రలో కనిపించింది. అస్సలు కనికరమే లేని పాత్ర అది. ప్రేమ వుంటుంది కానీ, చాలా కఠినంగా ప్రవర్తిస్తుంది. అలాంటి డిఫరెంట్ వేరియేషన్ వున్న పాత్రలో రాశీఖన్నా కనిపించింది. అయితే, ఈ పాత్రలో రాశీఖన్నాని చూసిన అభిమానులు కాస్త హర్ట్ అయ్యారట.
‘అలాంటి క్యారెక్టర్‌లో ఎలా నటిస్తావ్..’ అంటూ రాశీఖన్నాని ట్రోల్ చేస్తున్నారట. ‘నటిగా ఎదగాలంటే, అన్నిరకాల పాత్రల్లోనూ నటించాలి. ఎలాంటి ఎమోషన్న్ అయినా క్యారీ చేయాలి. చాలా అరుదుగా మాత్రమే ఇలాంటి పాత్రలు వస్తుంటాయి. ఎవరో ట్రోల్ చేశారని, అలాంటి ఛాన్సులు నేను వదులుకోలేను..’ అని తెగేసి చెప్పేసింది రాశీఖన్నా.
కాగా, తెలుగులో ప్రస్తుతం రాశీఖన్నా నాగ చైతన్యతో ‘థాంక్యూ’, గోపీచంద్‌తో ‘పక్కా కమర్షియల్’ సినిమాల్లో నటిస్తోంది.