బ‌య్య‌ర్ల కి వార్నింగ్ ఇచ్చిన పూరి జగన్నాధ్

టాలీవుడ్ లో స్పీడ్ గా సినిమాలు తీసే దర్శకుడిగా పూరి జగన్నాద్ కి పేరుంది. అంతే కాదు నష్టపోయిన బ‌య్య‌ర్ల కి పూరి జగన్నాధ్ కొంత డబ్బు వెనక్కి ఇచ్చిన సందర్భాలు కూడా ఉన్నాయి. పూరి జగన్నాధ్ లేటెస్ట్ మూవీ ‘లైగర్’ భారీ అంచనాలు మధ్య రిలీజ్ అయ్యి అట్టర్ ప్లాప్ అయ్యింది. దీంతో బైయర్లు పూరి జగన్నాధ్ ఇంటిని ముట్టడి చెయ్యడానికి రెడీ అవుతున్నారు.

ఈ వార్త తెలిసిన పూరి జగన్నాధ్ కి కోపం వచ్చింది. యితే తాజాగా పూరి జగన్నాథ్ ఓ వ్యక్తితో మాట్లాడిన ఆడియో లీక్ అయింది. ఆడియోలో పూరి జగన్నాథ్ బయ్యర్స్ పై ఫైర్ అవుతున్నారు. పూరి జగన్నాథ్ ఫోన్ కాల్ లో మాట్లాడుతూ…. ఏంటి బ్లాక్ మెయిల్ చేస్తున్నారా..? నేను ఎవరికీ డబ్బు తిరిగి ఇవ్వాల్సిన అవసరం లేదు. అయినా ఇస్తున్నాను ఎందుకు, పాపం వాళ్లు కూడా నష్టపోయారు లే అని.

ఆల్రెడీ బ‌య్య‌ర్స్ తో మాట్లాడటం జరిగింది. మరో నెలలో ఒప్పుకున్న డబ్బు మొత్తాన్ని ఇస్తానని చెప్పాను. చెప్పిన తర్వాత కూడా అతి చేస్తే ఇచ్చేది కూడా ఇవ్వబుద్ధి కాదు. ఎందుకు ఇస్తున్నాం పరువు కోసం ఇస్తున్నాం. నా పరువు తీయాలి అని చూస్తే మాత్రం ఒక్క రూపాయి కూడా ఇవ్వను. ఇక్కడ అందరం గ్యాంబ్లింగ్ చేస్తున్నాం.

కొన్ని సినిమాలు ఆడ‌తాయి… కొన్ని పోతాయి. పోకిరి దగ్గర నుండి ఇస్మార్ట్ శంకర్ వరకు బ‌య్య‌ర్ల‌ దగ్గర నుంచి నాకు రావాల్సిన డబ్బులు ఎంతో ఉన్నాయి. బ‌య్య‌ర్స్ అసోసియేషన్ నాకు ఆ డబ్బును తిరిగి ఇస్తుందా..? ధర్నా చేస్తామంటున్నారు చేయండి. ధర్నా చేసిన వాళ్ల లిస్ట్ తీసుకుని వాళ్ళకి తప్ప మిగతా వాళ్లకు డబ్బులు ఇస్తాను. అంటూ పూరి జగన్నాథ్ మాట్లాడిన ఆడియో వైరల్ అవుతోంది.