లైగ‌ర్ నుండి స‌ర్‌ప్రైజ్ అప్‌డేట్ ఇచ్చేసిన ఛార్మి.. రేపు ర‌చ్చ ర‌చ్చే..!

విజ‌య్ దేవ‌రకొంద ప్ర‌ధాన పాత్ర‌లో డాషింగ్ డైరెక్ట‌ర్ పూరీ జ‌గ‌న్నాథ్ తెర‌కెక్కిస్తున్న చిత్రం లైగ‌ర్. మ‌గ పులి, ఆడ‌పులి సంతానంని లైగ‌ర్ అని పిలుస్తాం. ఈ టైటిల్‌ని పూరీ జ‌గ‌న్నాథ్ త‌న సినిమాకు ఫిక్స్ చేశారు. కొద్ది రోజుల క్రితం చిత్ర టైటిల్‌తో పాటు ఫ‌స్ట్ లుక్ పోస్ట‌ర్ విడుద‌ల చేశాడు పూరీ జ‌గ‌న్నాథ్. ఈ పోస్ట‌ర్ నెటిజ‌న్స్‌ను ఎంత‌గానో ఆక‌ట్టుకుంది. పోస్ట‌ర్ లో విజ‌య్ దేవ‌ర‌కొండ‌ని చూసిన ఫ్యాన్స్ కు పూన‌కాలు వ‌చ్చేశాయి. సినిమా ఎప్పుడెప్పుడు వ‌స్తుందా అని ఆస‌క్తిగా ఎదురు చూడ‌డం మొద‌లు పెట్టారు. ఈ క్ర‌మంలో చిత్ర నిర్మాత ఛార్మి కౌర్, హీరోయిన్ అన‌న్య పాండే క్రేజీ అప్ డేట్ ఇచ్చారు.

సోష‌ల్ మీడియాలో వీడియో విడుద‌ల చేస్తూ ఫిబ్ర‌వ‌రి 11 ఉద‌యం 8.14ని.ల‌కు లైగ‌ర్ మూవీ రిలీజ్ డేట్ ప్ర‌క‌టించ‌నున్న‌ట్టు తెలియ‌జేశారు. దీంతో ఫ్యాన్స్ అంద‌రు ఆ టైంపై ఫోక‌స్ పెడుతున్నారు. బాలీవుడ్‌లో ప్రముఖ నిర్మాణ సంస్థ అయిన ధర్మ ప్రొడక్షన్స్‌తో కలిసి పూరి కనెక్ట్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. బాలీవుడ్ బ్యూటీ అనన్య పాండే క‌థానాయిక‌గా న‌టిస్తుంది. ఇస్మార్ట్ శంకర్ లాంటీ బ్లాక్ బస్టర్ సినిమా తర్వాత పూరి జగన్నాథ్ దర్శకత్వంలో వస్తోన్న ఈ సినిమా కోనం ఛార్మి, కరణ్ జోహార్‌లు కలిసి పని చేస్తుండ‌డం విశేషం. లైగర్ తెలుగు హిందీ భాషాల్లో మాత్రమే కాకుండా ఇండియాలోని ప్రధాన భాషాల్లో ఈ సినిమా విడుదల కానుంది.

లైగ‌ర్ చిత్రాన్ని భారీ బ‌డ్జెట్‌తో అత్యంత ప్ర‌తిష్టాత్మ‌కంగా తెర‌కెక్కించ‌నున్నారు. ముంబైలో చిత్ర షూటింగ్ చేస్తుండ‌గా, ఇందులో ఫైటర్‌గా క‌నిపించ‌నున్నాడు విజ‌య్ . ఈ సినిమాను 125 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ లైగర్ అటు పూరీ, ఇటు విజయ్ కెరీర్‌లో కూడా అత్యంత ఎక్కువ బడ్జెట్ సినిమాగా వస్తోంది. క‌రోనా వ‌ల‌న ఆగిన ఈ చిత్ర షూటింగ్ ఇప్పుడు శ‌ర‌వేగంగా షూటింగ్ జ‌రుపుకుంటుంది.

https://twitter.com/Charmmeofficial/status/1359383710282305537